Liquor Scam: ఏప్రిల్‌ 3 వరకు అరుణ్‌ పిళ్లైకు జుడీషియల్‌ కస్టడీ

Liquor Scam: ఏప్రిల్‌ 3 వరకు అరుణ్‌ పిళ్లైకు జుడీషియల్‌ కస్టడీ
అరుణ్‌ పిళ్లైతో కలిపి ఎమ్మెల్సీ కవితను విచారించిన ఈడీ

ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవితను ఈడీ విచారించింది. నాలుగున్నర గంటలపాటు అరుణ్‌ పిళ్లైతో పాటు ఆమెను ప్రశ్నించింది. ఇవాళ్టితో అరుణ్‌ కస్టడీ ముగుస్తుండటంతో అధికారులు పిళ్లైని కోర్టులో హాజరు పరిచారు. ఇవాళ కవిత, పిళ్లైని కలిపి ఈడీ ప్రశ్నించింది. విచారణకు సమయం సరిపోలేదన్న అధికారులు అరుణ్‌తో కలిపి కవితను మరోసారి ప్రశ్నించాలని భావించారు. ఇందుకోసం పిళ్లై కస్టడీని మరిన్ని రోజులు పొడగించాలని కోర్టును కోరారు. అయితే రౌజ్‌ అవెన్యూ కోర్టు మాత్రం పిళ్లైకి ఏప్రిల్‌ 3 వరకు జుడీషియల్‌ కస్టడీ విధించింది. దీంతో అరుణ్ రామచంద్ర పిళ్లై ఈడీ కస్టడీ ముగిసింది. అతన్ని కాసేపట్లో తీహార్‌ జైలుకు అధికారులు తరలించనున్నారు.

Tags

Next Story