Madhusudana chary : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారి..!

X
By - TV5 Digital Team |19 Nov 2021 11:29 AM IST
Madhusudhana Chary : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై నియమించారు.
Madhusudhana Chary : నామినేటెడ్ ఎమ్మెల్సీగా మాజీ స్పీకర్ మధుసూదనాచారిని గవర్నర్ తమిళిసై నియమించారు. మధుసూదనాచారి పేరును సూచిస్తూ తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు గవర్నర్ ఆమోదం తెలిపారు. కొద్ది రోజుల క్రితం కౌశిక్రెడ్డి పేరును గవర్నర్కు ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే ఇటీవల ఆయన్ను ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్ధిగా నియమించడంతో మొదట చేసిన ప్రతిపాదనను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీ పదవికి మధుసూదనాచారి పేరు సూచిస్తూ ప్రభుత్వం ప్రతిపాదన పంపడంతో గవర్నర్ ఆమోదం తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com