Mahaboobabad: పేదల గుడిసెల తొలగింపు.. భగ్గుమన్న బాధితులు

X
By - Subba Reddy |24 May 2023 11:00 AM IST
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల గుడిసెలను అధికారులు తొలగించడంపై బాధితులు భగ్గుమన్నారు
మహబూబాబాద్ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. పేదల గుడిసెలను అధికారులు తొలగించడంపై బాధితులు భగ్గుమన్నారు. పోలీసు బలగాలతో వచ్చిన రెవెన్యూ, మున్సిపల్ అధికారులను అడ్డుకున్నారు. దాంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. కొద్దిసేపు ఆ ప్రాంతం రణరంగంగా మారింది. పోలీసులు వెనక్కి వెళ్లాలంటూ బాధితులు ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు, అధికారుల చర్యలకు వ్యతిరేకంగా ఓ బాధితుడు పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. దాంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమ గుడిసెలను తొలగించొద్దంటూ బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com