MahabubNagar: ధాన్యం బస్తాల్లో కంకర కలిపి దర్జాగా సరఫరా
By - Subba Reddy |11 Feb 2023 5:45 AM GMT
జడ్చర్లలోని సత్యసాయి రైస్ మిల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా వెలుగులోకి వచ్చిన నిర్వాకం
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో ఘరానా మోసం బయటపడింది. ధాన్యం బస్తాల్లో కంకర మిక్సింగ్ చేసి దర్జాగా సరఫరా చేస్తున్నారు. జడ్చర్లలోని సత్యసాయి రైస్ మిల్లో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేపట్టగా ఈ నిర్వాకం వెలుగులోకి వచ్చింది. ధాన్యం బస్తాల్లో 10, 13 సైజు ఉండే కంకర రాళ్లను ధాన్యం బస్తాల్లో మిక్సింగ్ చేస్తున్నారు. విజిలెన్స్ అధికారులు తహసీల్దార్ సమక్షంలో తనిఖీలు చేసి కంకర కలిపిన 112 ధాన్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. ఓనర్పై కేసు నమోదు చేసి మిల్లును సీజ్ చేశారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com