MALLANNA: బీసీ నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ

MALLANNA: బీసీ నినాదంతో తెలంగాణ రాజ్యాధికార పార్టీ
X
కొత్త రాజకీయ పార్టీ ప్రకటించిన తీన్మార్ మల్లన్న.. బీసీ రాజ్యాధికారమే లక్ష్యంగా కొత్త పార్టీ.. 2028లో బీసీ వ్యక్తే తెలంగాణ సీఎం అని ధీమా... ఎరుపు, ఆకుపచ్చ రంగుల కలబోతతో పార్టీ జెండా

తె­లం­గాణ రా­జ­కీయ యవ­ని­క­పై కొ­త్త పా­ర్టీ పు­రు­డు­పో­సు­కుం­ది. ఎమ్మె­ల్సీ తీ­న్మా­ర్‌ మల్ల­న్న కొ­త్త రా­జ­కీయ పా­ర్టీ­ని ఏర్పా­టు చే­శా­రు. తన పా­ర్టీ­కి ‘తె­లం­గాణ రా­జ్యా­ధి­కార పా­ర్టీ’ అని పేరు పె­ట్టా­రు. తా­జ్‌­కృ­ష్ణ హో­ట­ల్‌­లో ఏర్పా­టు చే­సిన కా­ర్య­క్ర­మం­లో కొ­త్త రా­జ­కీయ పా­ర్టీ పే­రు­ను ప్ర­క­టిం­చా­రు. సె­ప్టెం­బ­ర్‌ 17వ తేదీ బీ­సీల తల­రాత మారే ది­నం­గా తాను భా­వి­స్తు­న్న­ట్లు ప్ర­క­టిం­చా­రు. తె­లం­గా­ణ­లో మె­జా­ర్టీ సం­ఖ్య­లో ఉన్న బీ­సీ­ల­కు రా­జ­కీయ పా­ర్టీ అవ­స­రం ఉం­ద­న్న ఉద్దే­శం­తో పా­ర్టీ­ని ఏర్పా­టు చే­స్తు­న్న­ట్లు తె­లి­పా­రు బీ­సీల ఆత్మ­గౌ­ర­వ­మే ప్ర­ధాన ఎజెం­డా­గా ఈ పా­ర్టీ­ని స్థా­పిం­చి­న­ట్లు ఆయన స్ప­ష్టం చే­శా­రు. తె­లం­గాణ భారత యూ­ని­య­న్‌­లో వి­లీ­న­మైన చా­రి­త్రక ది­న­మైన సె­ప్టెం­బ­ర్ 17న పా­ర్టీ­ని ప్ర­క­టిం­చ­డం ప్రా­ధా­న్యత సం­త­రిం­చు­కుం­ది.

పార్టీ జెండా ఇలా...

ఎరు­పు, ఆకు­ప­చ్చ రం­గుల కల­బో­త­తో తె­లం­గాణ రా­జ్య­ధి­కార పా­ర్టీ జెం­డా­ను తీ­న్మా­ర్ మల్ల­న్న ఆవి­ష్క­రిం­చా­రు. జెం­డా మధ్య­లో కా­ర్మిక చక్రా­న్ని, దాని నుం­చి పైకి లే­స్తు­న్న­ట్లు­గా పి­డి­కి­లి బి­గిం­చిన అర­చే­తి చి­హ్నం­గా పొం­దు­ప­రి­చా­రు. జెం­డా­పై 'ఆ­త్మ­గౌ­ర­వం, అధి­కా­రం, వా­టా' అనే ని­నా­దా­న్ని ము­ద్రిం­చా­రు. తె­లం­గాణ రా­జ్యా­ధి­కార పా­ర్టీ రా­ష్ట్ర కా­ర్య­వ­ర్గా­న్ని కూడా ప్ర­క­టిం­చా­రు. అధ్య­క్షు­డి­గా తీ­న్మా­ర్ మల్ల­న్న వ్య­హ­రిం­చ­ను­న్నా­రు. వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్లు­గా మాదం రజి­నీ కు­మా­ర్ యా­ద­వ్, సూ­ద­గా­ని హరి­శం­క­ర్ గౌ­డ్‌­ల­ను ని­య­మిం­చా­రు. ప్ర­ధాన కా­ర్య­ద­ర్శు­లు­గా వట్టే జా­న­య్య యా­ద­వ్, సం­గెం సూ­ర్యా రావు, పల్లె­బో­యిన అశో­క్ యా­ద­వ్, జ్యో­తి పం­డ­ల్ వ్య­హ­రిం­చా­రు. పా­ర్టీ కా­ర్య­వ­ర్గం­లో త్వ­ర­లో­నే యు­వ­త­కు కూడా స్థా­నం కల్పి­స్తా­మ­ని వా­రం­తా తె­లం­గాణ రా­జ్యా­ధి­కార పా­ర్టీ­ని ముం­దుం­డి నడి­పిం­చా­ల­ని పి­లు­పు­ని­చ్చా­రు. మి­గ­తా వి­భా­గా­ల­కు సం­బం­ధిం­చి కా­ర్య­వ­ర్గా­ల­ను త్వ­ర­లో­నే ఎన్ను­కు­ని ప్ర­క­టి­స్తా­మ­ని తీ­న్మా­ర్ మల్ల­న్న స్ప­ష్టం చే­శా­రు. తె­లం­గాణ రా­జ్యా­ధి­కార పా­ర్టీ (TRP) తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో క్రి­యా­శీ­లక పా­త్ర పో­షిం­చ­బో­తోం­ద­ని తీ­న్మా­ర్ మల్ల­న్న వె­ల్ల­డిం­చా­రు.


తీన్మార్ మల్లన్న కీలక వ్యాఖ్యలు

బీ­సీల చే­తి­లో భూ­ము­లు, సంపద మ, జకీయ అధి­కా­రం అమలు చే­య­డం లక్ష్య­మ­ని చె­బు­తు­న్నా­రు. "తె­లం­గాణ గడ్డ మీద బీ­సీ­లు తమకు తా­ము­గా ఒక రా­జ­కీయ పా­ర్టీ­ని తీ­సు­కొ­చ్చా­మ­ని బీ­సీ­లు ఏకం చేసి, వారి హక్కుల కోసం పో­రా­డ­తా­ము." అని ప్ర­క­టిం­చా­రు. అయి­తే మల్ల­న్న పా­ర్టీ పె­ట్ట­డం ఇదే మొ­ద­టి సారి కాదు. 2023లో 'తె­లం­గాణ ని­ర్మాణ పా­ర్టీ' పే­రు­తో కొ­త్త పా­ర్టీ ప్ర­క­టిం­చా­రు, కానీ అది ముం­దు­కు సా­గ­లే­దు. ఇప్పు­డు బీసీ ఎజెం­డా­తో కొ­త్త­గా ప్ర­య­త్ని­స్తు­న్నా­రు. తీ­న్మా­ర్ మల్ల­న్న రా­జ­కీ­యం­గా ము­ఖ్య­మం­త్రి స్థా­నా­న్ని­పొం­దా­ల­ని లక్ష్యం­గా పె­ట్టు­కు­న్నా­రు. గతం­లో బీసీ సం­ఘాల కోసం సభలు ని­ర్వ­హిం­చా­రు. ఇప్పు­డు నే­రు­గా పా­ర్టీ పె­ట్ట­డం ద్వా­రా.. బీ­సీ­ల్లో­ని అన్ని కు­లా­ల­ను ఏకం­గా చేసి ఆయన రా­జ్యా­ధి­కా­రం చే­ప­ట్టా­ల­ని అను­కుం­టు­న్నా­రు.

వచ్చేది బీసీ ముఖ్యమంత్రే

రా­బో­యే రో­జు­ల్లో బీ­సీ­లు అధి­కా­రం­లో­కి వస్తా­ర­ని ధీమా వ్య­క్తం చే­శా­రు. ఎస్సీ, ఎస్టీ, మై­నా­ర్టీ­ల­తో కలి­సి బీ­సీ­లు తె­లం­గా­ణ­లో అధి­కా­రం సా­ధి­స్తా­ర­ని తె­లి­పా­రు. 2028లో ఒక బీసీ వ్య­క్తి తె­లం­గాణ రా­ష్ట్రా­ని­కి ము­ఖ్య­మం­త్రి అవు­తా­ర­ని ఆయన ధీమా వ్య­క్తం చే­శా­రు. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి బీ­సీ­ల­కు 42 శాతం రి­జ­ర్వే­ష­న్లు ఇస్తా­మ­ని చె­ప్పి మోసం చే­స్తు­న్నా­ర­ని మల్ల­న్న వి­మ­ర్శిం­చా­రు. బీ­సీ­ల­ను మోసం చే­సిన అగ్ర­వ­ర్ణ పా­ర్టీ­ల­ను గో­ల్కొండ కోట వరకు తరి­మి­కొ­ట్ట­క­పో­తే తన పేరు తీ­న్మా­ర్ మల్ల­న్న కా­దం­టూ సవా­ల్ చే­శా­రు. రా­బో­యే స్థా­నిక సం­స్థల ఎన్ని­క­ల్లో బీ­సీ­లం­తా పోటీ చే­య­డా­ని­కి సి­ద్ధం కా­వా­ల­ని మల్ల­న్న పి­లు­పు­ని­చ్చా­రు. తె­లం­గా­ణ­లో ము­ది­రా­జు­లు బీసీ ఉద్య­మా­ని­కి పె­ద్ద­న్న పా­త్ర పో­షిం­చా­ల­ని ఆయన కో­రా­రు. బీసీ ప్ర­భు­త్వం ఏర్ప­డిన తర్వాత ల్యాం­డ్ సీ­లిం­గ్ యా­క్ట్ తీ­సు­కు­వ­చ్చి ప్ర­తి బీసీ ఇం­టి­కి రెం­డె­క­రాల భూమి పం­పి­ణీ చే­స్తా­మ­ని ఆయన హామీ ఇచ్చా­రు. తీన్మార్ మల్లన్న అసలు పేరు చింతపండు నవీన్ కుమార్. ఆయన మొదట జర్నలిస్ట్‌గా పని చేశారు. తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. 2021 డిసెంబర్ 7న [బీజేపీ](https://telugu.abplive.com/topic/BJP)లో చేరారు. 2023 నవంబర్ 8న మళ్లీ కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేరారు.

Tags

Next Story