Mancherial: మంచిర్యాలలో విషాదం.. డబ్బుల్లేక సోదరుడి మృతదేహాన్ని వదిలేసి..

Mancherial: మంచిర్యాలలో విషాదం.. డబ్బుల్లేక సోదరుడి మృతదేహాన్ని వదిలేసి..
Mancherial: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది.

Mancherial: మంచిర్యాల జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో హృదయ విదారక ఘటన వెలుగు చూసింది. వడదెబ్బతో మృతి చెందిన సోదరుడి డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకు వెళ్లెందుకు కూడా డబ్బుల్లేక ఓ వ్యక్తి శవాన్ని అక్కడే వదిలి వెళ్లిపోయాడు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన మోతీషా అనే 23 ఏళ్ల యువకుడు ఏప్రిల్ 28న తన సోదరుడితో కలిసి రైలులో ప్రయాణిస్తుండగా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు.

పరిస్థితి ఆందోళనకరంగా మారడంతో బెల్లంపల్లి స్టేషన్‌లో దిగేసి ఇద్దరూ అక్కడి నుంచి ఆసుపత్రికి వెళ్లారు. తర్వాత వైద్యుల సూచనల మేరకు మంచిర్యాలలోని జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. అప్పటికే ఆరోగ్యం విషమించడంతో మోతీషా ప్రాణాలు కోల్పోయాడు. డెడ్‌బాడీని స్వస్థలానికి తీసుకెళ్లేందుకు సోదరుడు ఓ ప్రైవేటు అంబులెన్స్‌ ఆపరేటర్‌ను సంప్రదించగా వాళ్లు 80 వేలు డిమాండ్ చేశారు.

నిరుపేద కావడంతో అంత డబ్బు చెల్లించే స్థోమత లేక చివరికి శవాన్ని ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఆ మృతదేహం ఆసుపత్రి మార్చురీలోనే అనాథగా పడి ఉంది. హాస్పిటల్‌ సిబ్బంది మృతుడి సోదరుడిని ఫోన్‌ ద్వారా సంప్రదించడానికి పలుమార్లు ప్రయత్నించినా స్పందించడం లేదు. చేసేది లేక మృతుడి కుటుంబసభ్యుల వివరాలు సేకరిస్తు న్నట్లు ఆసుపత్రి ఉన్నతాధికారులు తెలిపారు.

Tags

Read MoreRead Less
Next Story