తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో శ్రీకాంతాచారి తల్లి సంచల వ్యాఖ్యలు
By - Subba Reddy |4 Jun 2023 7:30 AM GMT
తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అమరడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు
తెలంగాణ ఆవతరణ దశాబ్ది ఉత్సవాల్లో అమరవీరుడు కాసోజు శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ అమరవీరుల కుటుంబాలను ప్రభుత్వం మరిచిపోతుందన్నారు. అమరుల కుటుంబాలను రాష్ట్ర ప్రభుత్వ ఆదుకోవాలని కోరారు. తెలంగాణ అవతరణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి కలెక్టర్ కార్యాలయంలో.. 32 మంది అమరవీరుల కుటుంబాలను జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడిన శంకరమ్మ అమరవీరుల కుటుంబాలను సన్మానించడం సంతోషమే గానీ.. రాష్ట్ర ప్రభుత్వం వారిని ఆదుకోవాలంటూ కామెంట్స్ చేయడం సంచలనంగా మారింది.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com