MAYOR: గులాబీ కోటకు కాంగ్రెస్ ‘ఎక్స్ అఫీషియో’ షాక్

తెలంగాణలో హంగ్ మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నది. ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాని చోట్ల ఇండింపెండెంట్లే కింగ్ మేకర్లుగా మారడంతో బేరసారాలు జోరందుకున్నాయి. అన్నిచోట్లా క్యాంపు రాజకీయాలు నడుస్తున్నాయి. సోమవారం పరోక్ష పద్ధతిలో మేయర్, చైర్పర్సన్ ఎన్నికలు జరగనున్నాయి. గెలిచిన కౌన్సిలర్లు, కార్పొరేటర్లతోపాటు మీటింగ్కు హాజరయ్యే ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 50 శాతానికి పైగా ఓట్లు వచ్చిన పార్టీ అభ్యర్థులే మేయర్, చైర్పర్సన్అవుతారు. డిప్యూటీ మేయర్, డిప్యూటీ చైర్పర్సన్ ఎన్నికలు కూడా ఇదే విధంగా నిర్వహిస్తారు. దీంతో హంగ్ మున్సిపాలిటీల్లో ఇండింపెండెంట్లు కీలకంగా మారారు. వీరిని తమవైపు తిప్పుకోవడానికి అన్ని రాజకీయ పార్టీలు బేరసారాలు మొదలుపెట్టాయి. క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎక్స్అఫీషియో సభ్యుల ఓటు హక్కుపై శనివారం రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) క్లారిటీ ఇచ్చింది. ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదుచేసుకునే ఎమ్మెల్యేలు, ఎంపీల నియోజకవర్గాల్లో ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు భాగమై ఉండాలి. ఇక రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలకు ఆయా కార్పొరేషన్లు, మున్సిపాలిటీల పరిధిలో ఓటు కలిగి ఉండాలి. హైకోర్టు తీర్పుకు తగ్గట్టుగా ఎస్ఈసీ కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. దీంతో చాలా చోట్ల సమీకరణాలు మారనున్నాయి.
‘చేతులెత్తే పద్ధతిలో ’ మేయర్, చైర్పర్స్ ఎన్నికలు జరుగుతాయి. బరిలో ఉన్న ఇద్దరికి సమాన ఓట్లు వస్తే లాటరీ ద్వారా విజేతను ప్రకటిస్తారు. కొత్తగా ఎన్నికైన సభ్యులతోపాటు ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎక్స్అఫీషియో సభ్యులుగా నమోదు చేసుకున్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యులకు ఓటు హక్కు ఉంటుంది. ఈ మేరకు వీరి పేర్లను ఆయా జిల్లాల కలెక్టర్లు శనివారం ఫైనల్ చేసి ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆఫీసర్లకు పంపించారు.
రాజ్యసభ సభ్యులు, ఎమ్మెల్సీలు ఆయా ప్రాంతాల్లో ఓటరు నమోదు చేసుకుని ఉండాలి. హైకోర్టు తీర్పు ప్రకారం కొత్త మార్గదర్శకాలు జారీ చేయడంతో కొన్ని చోట్ల సమీకరణాలు మారే అవకాశం ఉంది. జిల్లా కలెక్టర్లు ఎక్స్అఫీషియో సభ్యుల జాబితాలను ఖరారు చేసి సంబంధిత అధికారులకు పంపించారు. ఎన్నికల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించేందుకు వీడియో చిత్రీకరణ తప్పనిసరి చేశారు. అవసరమైతే ప్రత్యక్ష ప్రసారం కూడా చేయవచ్చని సూచించారు. పరోక్ష ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులను ఆదేశించింది. స్వేచ్ఛగా ఓటు వేయగల వాతావరణం కల్పించాలని స్పష్టం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
