MEDARAM: వనమంతా జనం... ముగిసిన మహా సంబరం

MEDARAM: వనమంతా జనం... ముగిసిన మహా సంబరం
X
ముగిసిన మేడారం మహా జాతర... వన ప్రవేశం చేసిన సమ్మక్క-సారాలమ్మ.... చివరి రోజూ పోటెత్తిన భక్త జన సంద్రం

ఆది­వా­సీ సం­ప్ర­దా­యం, భక్తి, ఆధ్యా­త్మి­కత కలసి రూ­పు­ది­ద్దు­కు­న్న ప్ర­పంచ ప్ర­సి­ద్ధ మే­డా­రం మహా­జా­తర మరో­సా­రి అద్భుత ఘట్టా­ని­కి తె­ర­దిం­చిం­ది. కో­ట్లా­ది మంది భక్తుల నడుమ జరి­గిన ఈ మహో­త్స­వం, చి­వ­రి రోజు భా­వో­ద్వే­గాల మధ్య ము­గి­సిం­ది. వనం నుం­చి జనం­లో­కి వచ్చిన వన­దే­వ­త­లు తి­రి­గి అడ­వి­లో­కి ప్ర­వే­శిం­చ­డం­తో మే­డా­రం మహా­జా­త­ర­కు శని­వా­రం అధి­కా­రిక ము­గిం­పు పలి­కిం­ది. అమ్మ­వా­ర్ల­కు వీ­డ్కో­లు పలు­కు­తూ భక్తు­లు “మళ్లీ 2028లో కలు­ద్దాం” అంటూ కన్నీ­టి వీ­డ్కో­లు ఇచ్చా­రు.

ఈ నెల 28న ప్రా­రం­భ­మైన మే­డా­రం మహా­జా­తర, చి­వ­రి రో­జున భక్తు­ల­తో కి­క్కి­రి­సి­పో­యిం­ది. తె­లం­గా­ణ­తో పాటు ఆం­ధ్ర­ప్ర­దే­శ్, మహా­రా­ష్ట్ర, కర్ణా­టక, ఛత్తీ­స్‌­గ­ఢ్ సహా పలు రా­ష్ట్రాల నుం­చి లక్ష­లా­ది మంది భక్తు­లు మే­డా­రా­ని­కి తర­లి­వ­చ్చా­రు. చి­వ­రి రోజు గద్దె­ల­పై తల్లు­లు కొ­లు­వు­దీ­ర­డం­తో, దర్శ­నా­ని­కి భక్తు­లు భా­రీ­గా క్యూ కట్టా­రు. అడ­వి­లో­ని ప్ర­శాం­తత నుం­చి జన­సం­ద్రం­గా మా­రిన మే­డా­రం ప్రాం­తం భక్తి పా­ర­వ­శ్యం­తో మా­ర్మో­గిం­ది. మే­డా­రం జా­త­ర­లో అత్యంత కీ­ల­క­మైన ఘట్టం అయిన వన­ప్ర­వే­శం శని­వా­రం సా­యం­త్రం ఘనం­గా జరి­గిం­ది. గు­రు­వా­రం గద్దె­ల­పై కొ­లు­వు­దీ­రిన అమ్మ­వా­ర్లు, భక్తుల పూజల అనం­త­రం చి­ల­క­ల­గు­ట్ట వైపు వన­ప్ర­వే­శం చే­శా­రు. సా­యం­త్రం ఆరు గంటల ప్రాం­తం­లో ము­గిం­పు కా­ర్య­క్ర­మా­లు పూ­ర్తి కా­వ­డం­తో, వనం వీడి జనాల మధ్య­కొ­చ్చిన సమ్మ­క్క, సా­ర­ల­మ్మ, పగి­డి­ద్ద­రా­జు, గో­విం­ద­రా­జు­లు తి­రి­గి వనం­లో­కి చే­రు­కు­న్నా­రు.

ఈ దృ­శ్యం చూ­సిన భక్తు­లు బా­వో­ద్వే­గా­ని­కి లో­న­య్యా­రు. జాతర ప్రారంభం నుంచీ ప్రతి రోజు ప్రత్యేక ఘట్టాలతో సాగింది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపైకి చేరుకున్నారు. ఆ తరువాత 29వ తేదీన చిలకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెపై ప్రతిష్టించారు. ఈ ఘట్టం మేడారం జాతరలో అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.

శు­క్ర­వా­రం సమ్మ­క్క, సా­ర­ల­మ్మ­తో పాటు పగి­డి­ద్ద­రా­జు, గో­విం­ద­రా­జు­లు భక్తు­ల­కు దర్శ­న­భా­గ్యం కల్పిం­చా­రు. ఇద్ద­రు తల్లు­లు గద్దె­ల­పై కొ­లు­వు­దీ­ర­డం­తో, భక్తు­లు క్ర­మం­గా దర్శ­నం చే­సు­కు­ని గూ­డా­రా­ల­ను ఖాళీ చేసి తమ తమ ఊళ్ల­కు తి­రు­గు ప్ర­యా­ణం ప్రా­రం­భిం­చా­రు. శని­వా­రం నలు­గు­రు తి­రి­గి వన­ప్ర­వే­శం చే­య­డం­తో జా­త­ర­కు అధి­కా­రిక ము­గిం­పు పలి­కి­న­ట్ట­యిం­ది. ఈసా­రి కూడా భక్తుల నమ్మ­కం, వి­శ్వా­సం, భక్తి మే­డా­రం అడ­వు­ల­ను పర­వ­శిం­ప­జే­శా­యి. వన­ప్ర­వే­శం­తో జాతర ము­గి­సి­నా, భక్తుల హృ­ద­యా­ల్లో అమ్మ­వా­ర్ల అను­భూ­తి చె­గ­ని ము­ద్ర­గా మి­గి­లిం­ది. ఇక మరో నా­లు­గే­ళ్ల తర్వాత, 2028లో మళ్లీ అదే భక్తి, అదే ఉత్సా­హం­తో మే­డా­రం జన­సం­ద్రం­గా మా­ర­నుం­ది. నా­లు­గే­ళ్ల­కో­సా­రి జరి­గే ఈ జాతర కోసం భక్తు­లు ఎదు­రు­చూ­స్తా­రు.

Tags

Next Story