Medico Suicide Attempt : ప్రీతీని పరామర్శించిన మంత్రి సత్యవతి రాథోడ్
వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ప్రీతిని మంత్రి సత్యవతి రాథోడ్ పరామర్శించారు. ఆమె ఆరోగ్యం మెరుగవుతుందని తెలిపారు. ప్రీతి కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఆత్మహత్యాయత్నానికి పాల్పడి నిమ్స్లో వెంటిలేటర్పై చికిత్స పొందుతున్న ప్రీతి పరిస్థితి విషమంగానే ఉందని ఆమె తండ్రి తెలిపారు. ఎక్మో మీదనే చికిత్స అందిస్తున్నారని .. నిన్నటి నుంచి ఆరోగ్యం కొద్దిగా మెరుగవుతోందని వైద్యులు చెబుతున్నారని అన్నారు. ప్రీతి కళ్లు తెరిచి చూడటం కానీ మాట్లాడటం చేయడం లేదని వివరించారు. వరంగల్ నుంచి ఎలాంటి పరిస్థితిలో వచ్చామో ఇపుడు కూడా అలాంటి స్థితిలోనే ప్రీతి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రీతి తండ్రి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com