జీహెచ్ఎంసీ కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ ఫోకస్
GHMC కార్యక్రమాలపై మంత్రి కేటీఆర్ మూడు పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్ష నిర్వహించారు. సికింద్రాబాద్, హైదరాబాద్, చేవెల్ల నియోజకవర్గాలకు సంబంధించిన వారితో చర్చించారు. ఆయా నియోజకవర్గాల్లో GHMC చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల పైన, మౌలిక వసతుల కల్పన పైన ప్రజల స్పందన ఎలా ఉందని మంత్రులను అడిగి తెలుసుకున్నారు.
త్వరలో చేపట్టనున్న వివిధ కార్యక్రమాలను సైతం వారికి వివరించారు. ప్రస్తుతం నడుస్తున్న కార్యక్రమాలను మరింత వేగవంతంగా ముందుకు తీసుకెళ్తామని, ఇందుకు సంబంధించి అధికారులతో కూడా మరోసారి సమావేశం నిర్వహిస్తామని ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చారు. GHMC గత ఐదు సంవత్సరాలుగా చేపడుతూ వస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం, రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనకు సంబంధించిన కార్యక్రమాలు పైన ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని ఎమ్మెల్యేలు మంత్రికి వివరించారు. ముఖ్యంగా లాక్డౌన్ సమయంలో పెద్ద ఎత్తున రోడ్లను విస్తరించడం లేదా నిర్మాణం చేయడం ద్వారా ప్రజల్లో ఒక మంచి గుడ్విల్ వచ్చిందని తెలిపారు.
త్వరలోనే జిహెచ్ఎంసి పరిధిలో సుమారు 85 వేల ఇళ్లు, పేద ప్రజలకు అందించేలా ముందుకుపోతున్నామని ఇందుకు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కూడా వేగవంతం చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు మంత్రి ఈటెల. దీంతోపాటు పార్కుల అభివృద్ధి పైన ప్రత్యేకమైన డ్రైవ్ చేపట్టి ముందుకు పోతున్నామని తెలియజేశారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com