Harish Rao : ప్రజలను వంచించడంలో బీజేపీని మించిన వాళ్లులేరు : హరీష్ రావు
By - /TV5 Digital Team |22 Oct 2021 12:15 PM GMT
Harish Rao : విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. బ్లాక్ మనీ తెచ్చి పేదలకు పంచుతామన్నారు..
Harish Rao : విభజన హామీలను అమలు చేయడంలో కేంద్రం విఫలమైందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. బ్లాక్ మనీ తెచ్చి పేదలకు పంచుతామన్నారు.. ఏమైందని నిలదీశారు. గ్యాస్, పెట్రోల్ ధరలను ఎందుకు తగ్గించలేదని నిలదీశారు. హుజురాబాద్ నియోజవర్గంలో ప్రచారం నిర్వహించిన మంత్రి.. బీజేపీపై పలు విమర్శలు గుప్పించారు. బీజేపీ ఒక్క హామి కూడా నెరవేర్చలేదని... ప్రజలను వంచించడంలో బీజేపీని మించిన వాళ్లులేరన్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీని చిత్తుగా ఓడిస్తారని హరీష్ జోస్యం చెప్పారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com