Harish Rao : ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెడితే.. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి గౌరవించింది : హరీష్ రావు

Harish Rao : ఏపీ ప్రభుత్వం టీచర్లపై కేసులు పెడితే.. తెలంగాణ ప్రభుత్వం 73 శాతం ఫిట్మెంట్ ఇచ్చి గౌరవించింది : హరీష్ రావు
Harish Rao : సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు

Harish Rao : ఏపీ ప్రభుత్వంపై మరోసారి విరుచుకుపడ్డారు మంత్రి హరీష్ రావు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులపై కేసులు పెట్టి జైల్లో వేస్తుందని.. కానీ తెలంగాణలో మాత్రం టీచర్లను గౌరవించి 73 శాతం ఫీట్ మెంట్ ఇచ్చిందన్నారు.

సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో జరిగిన రాష్ట్రోపాధ్యాయ సంఘం వజ్రోత్సవ సంబరాల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉపాధ్యాయులను సత్కరించారు. ఏ ప్రభుత్వం అయినా వందకు వందశాతం పనులు చేయడం సాధ్యం కాదన్నారు. విద్యకు తెలంగాణాలో శాఖల వారిగా ఖర్చుపెడుతున్నామని.. రెసిడెన్సియల్ పాఠశాల మీద ప్రభుత్వం చేసే ఖర్చు 3వేల 3వందల కోట్లు అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story