బీజేపీ.. మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోంది -హరీష్ రావు

బీజేపీ.. మతవిద్వేషాలను రెచ్చగొట్టి ఓట్లు దండుకోవాలని చూస్తోంది -హరీష్ రావు

బీజేపీ మతవిద్వేషాలను రెచ్చగొట్టి, ప్రజలమధ్య చిచ్చుపెట్టి ఓట్లు దండుకోవాలని చూస్తుందని మండిపడ్డారు మంత్రి హరీష్‌ రావు. పేదప్రజలకోసం బీజేపీ చేసిన ఒక్క మంచి పని అయినా ఉందా అని ఆయన ప్రశ్నించారు. 112వ డివిజన్ జ్యోతినగర్ మంత్రి ప్రచారం చేపట్టారు. దేశభక్తులమనే చెప్పుకొనే బీజేపీ వారు దేశాన్ని కాపాడే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని అమ్మాలని ఎలా ఆలోచిస్తారని ప్రశ్నించారు. తెలంగాణకు వచ్చిన ఐటిఐఆర్ ప్రాజెక్టు ను రద్దుచేసిందన్నారు. బీజేపీ సోషల్ మీడియాలో తప్ప ఎక్కడా లేదని మంత్రి హరీష్‌ రావు విమర్శించారు.

Tags

Read MoreRead Less
Next Story