నల్లధనం అంతా బీజేపీ నాయకుల జేబుల్లోకే వెళ్లింది : మంత్రి హరీష్రావు
By - kasi |24 Nov 2020 11:33 AM GMT
టీఆర్ఎస్ మేనిఫెస్టో అన్ని వర్గాలకు మేలు చేసేలా ఉందన్నారు మంత్రి హరీష్రావు. పఠాన్చెరులోని మూడు డివిజన్లలో టీఆర్ఎస్ అభ్యర్థుల తరపున హరీష్రావు ప్రచారం నిర్వహించారు. అభ్యర్థులకు మద్దతుగా నిర్వహించిన బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. టీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
వరదలు వస్తే బెంగళూరుకు 6 వందల కోట్లు, గుజరాత్కు 5 వందల కోట్లు ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని హరీష్ మండిపడ్డారు. యువత బీజేపీకి బుద్ధి చెప్పాలన్నారు. నల్లధనం అంతా బీజేపీ నాయకుల జేబుల్లోకే వెళ్లిందని ఆరోపించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com