కేంద్రం తెలంగాణ వడ్లను కొంటుందా.. లేదా? : మంత్రి నిరంజన్ రెడ్డి
By - TV5 Digital Team |9 Nov 2021 3:37 PM GMT
కేంద్రం తెలంగాణ వడ్లను కొంటుందా.. లేదా సమాధానం చెప్పాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయి..
కేంద్రం తెలంగాణ వడ్లను కొంటుందా.. లేదా సమాధానం చెప్పాలన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. యాసంగిలో బాయిల్డ్ రైస్ మాత్రమే వస్తాయి.. రా రైస్ రావన్నారు. బాయిల్డ్ రైస్ తినేవారి సంఖ్య తగ్గితే దానికి పరిష్కారం చూపించే భాద్యత కేంద్రంపై లేదా అని నిలదీసిన నిరంజన్ రెడ్డి.. కేంద్రం తన భాద్యతలో ఘోరమైన వైఫల్యం చెందిందని ఆరోపించారు.కేంద్రం తమ వైఖరి చెప్పకపోతే ఆత్మద్రోహం.. తెలంగాణద్రోహం అవుతుందన్నారు నిరంజన్ రెడ్డి. తెలంగాణ ప్రజల ఆవేదన కేంద్రానికి పట్టదా అని ప్రశ్నించిన మంత్రి.. కేంద్ర ప్రభుత్వ విధానం ఏంటో సూటిగా చెప్పాలని డిమాండ్ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ కూడా కేంద్రంపై విరుచుకుపడ్డారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ తెలంగాణ వడ్లను కొనేలా కేంద్రాన్ని ఒప్పించాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com