పోలియో రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలి : మంత్రి సబితా

X
By - TV5 Digital Team |31 Jan 2021 12:15 PM IST
పోలియో రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి.
పోలియో రహిత సమాజం కోసం ప్రతిఒక్కరూ కృషి చేయాలన్నారు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి. కందుకూరు పీహెచ్సీలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ప్రతి ఒక్కరూ రెండు చుక్కలతో తమ పిల్లల ఆరోగ్యానికి భరోసా ఇవ్వాలన్నారు. పోలియోబారిన పడకుండా కాపాడాలని సూచించారు. మూడు రోజుల పాటు పల్స్ పోలియో కార్యక్రమం జరుగుతుందని 54 మొబైట్ టీమ్లను కూడా అందుబాటులో ఉంచామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 38 లక్షల 31 వేల మందికి పైగా చిన్నారులకు పోలియో డ్రాప్స్ వేయిస్తున్నామని మంత్రి సబితా తెలిపారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com