పలు సమస్యల సత్వర పరిష్కారం కోసమే పల్లె నిద్ర : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పలు సమస్యల సత్వర పరిష్కారం కోసమే పల్లె నిద్ర : మంత్రి సబితా ఇంద్రారెడ్డి

పల్లె నిద్ర ద్వారా పల్లెల ప్రగతి బాటకు అడుగులు వేయడానికి కృషి చేస్తున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల పరిధిలోని మాదాపూర్‌ గ్రామంలో మంత్రి పర్యటించారు.. పాదయాత్ర ద్వారా ఇంటింటికీ వెళ్లి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. పల్లె ప్రగతి ద్వారా అమలవుతున్న పథకాలను పరిశీలించారు.

జిల్లా, మండల, గ్రామస్థాయి అధికారులతో కలిసి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపారు.. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి ద్వారా ప్రతినెలా 339 కోట్లు మంజూరు చేస్తున్నట్లు సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. స్వచ్ఛ మాదాపూర్‌ కోసం అంతా ప్రతిన బూనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతు బీమా మంజూరు పత్రాలను లబ్ధిదారులకు అందజేశారు. ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని గ్రామస్తులకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story