తెలంగాణలో మిర్చిపంటకు పట్టుకున్న మరో తెగులు

X
ఆరుగాలం కష్టించినా పంట చేతికొచ్చే వరకు రైతులకు కష్టాలు తప్పడం లేదు. తెలంగాణలో మిర్చిపంటకు మరో తెగులు పట్టుకుంది. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలోని బోడతండాకు చెందిన రైతులు వీరన్న,కిషన్ మూడున్నర ఎకరాల్లో ఐదు లక్షల పెట్టుబడితో మిర్చి సాగు చేశారు. పంట చేతికొస్తుందన్న సమయంలో వేరుకుళ్లుతో పంట మొత్తం ధ్వంసమైంది. ప్రభుత్వం తమల్ని ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మండల వ్యవసాయ అధికారులు పంటను పరిశీలించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
