ఈటల సీఎం పదవికి అర్హుడని కేసీఆర్కు మింగుడు పడలేదు: జీవన్ రెడ్డి

X
By - TV5 Digital Team |1 May 2021 3:00 PM IST
ఈటల రాజెందర్ భూకబ్జాలకు పాల్పడ్డారని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు.
ఈటల రాజెందర్ భూకబ్జాలకు పాల్పడ్డారని వార్తలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కేటీఆర్ను సీఎం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని చెప్పారు. ఈటల సీఎం పదవికి అర్హుడనే అంశం తెరమీదకు రావడంతో కేసీఆర్కు మింగుడు పడడం లేదన్నారు. ఈటల సామాజిక స్ఫూర్తి కలిగిన వ్యక్తి అని, పౌల్ట్రీలో ఈటల దశలువారీగా ఎదుగుతూ వచ్చారని అన్నారు. కేసీఆర్, ఈటల ఆస్తులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com