సీపీసీ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

హైదరాబాద్ కామినేని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజాను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. నగరంలో జరుగుతున్న పార్టీ జాతీయ సమితి సమావేశాల్లో పాల్గొన్న ఆయన.. నిన్న స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. దీంతో వెంటనే పార్టీ నాయకులు ఆయన్ను కోఠీలోని కామినేని హాస్పిటల్కు తరలించారు.
ఈ క్రమంలో చికిత్స పొంతుదున్న ఆయనను ఎమ్మెల్సీ కవిత పరామర్శించారు. చికిత్స గురించి వైద్యులతో మాట్లాడారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి ఎమ్మెల్సీ కవిత వెంట ఉన్నారు. సీపీఐ జాతీయ సమితి సమావేశాలు హైదరాబాద్లోని పార్టీ కార్యాలయంలో జరుగుతున్నాయి.
ఈ క్రమంలో ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజా.... నిన్న సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అస్వస్థతకు గురయ్యారు. ప్రసుత్తం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు ప్రకటించారు. షుగర్ లెవల్స్ పడిపోవడంతో అస్వస్థతకు గురయ్యారని, వైద్యం అందిస్తున్నామని వెల్లడించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com