MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత సీరియస్..

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం ఆరోపణలపై కవిత సీరియస్..
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేస్తున్న నేతలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత.

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాంలో తనపై ఆరోపణలు చేస్తున్న నేతలపై సీరియస్ అయ్యారు ఎమ్మెల్సీ కవిత. తనపై ఆరోపలు చేసిన ఢిల్లీ బీజేపీ నేతలపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్ధమవుతున్నారు. బీజేపీ ఎంపీ పర్వేష్‌ శర్మ, మాజీ ఎమ్మెల్యే మంజిందర్ సిర్సాపై పరువు నష్టం దావా వేయనున్నట్లు సమాచారం. నిరాధార ఆరోపణలు చేసినందుకు వ్యతిరేకంగా ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోర్టును కోరనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై ఇప్పటికే న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నారు కవిత. మరోవైపు తెలంగాణలోని 33 జిల్లాల్లో కేసులు నమోదు చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Tags

Read MoreRead Less
Next Story