జన్నేపల్లి శివాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు
నిజామాబాద్ బోధన్ నియోజకవర్గంలోని జన్నపల్లిలో పునరుద్ధరించిన పురాతన శివాలయాన్ని ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ఆధునీకరించారు. ఆలయ ప్రారంభోత్సవానికి విచ్చేసిన కవితకు వేద పండితులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. భక్తులు వేలాదిగా తరలివచ్చారు. ఆలయ ప్రారంభోత్సవం తర్వాత ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, గణేశ్ గుప్తా, జీవన్రెడ్డి, షకీల్, ఎంపీ బీబీ పాటిల్ పాల్గొన్నారు.
జన్నపల్లి పురాతన శివాలయం ప్రారంభోత్సవం తర్వాత మాట్లాడిన ఎమ్మెల్సీ కవిత.... ఆలయానికి పూర్వవైభవం తీసుకురావడం పట్ల హర్షం వ్యక్తంచేశారు. మైనంపల్లి సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ను, సంస్థ నిర్వాహకుడు మైనంపల్లి హన్మంతరావును అభినందించారు. మైనంపల్లి హన్మంతరావు సంకల్పంతోనే ఆలయం కొత్త రూపుదిద్దుకుందని అన్నారు. జన్నపల్లి ఆలయం ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. జన్నపల్లిని మండల కేంద్రంగా చేస్తామని, రోడ్లు, సెంట్రల్ లైటింగ్ కోసం నిధులు వెచ్చిస్తామని కవిత చెప్పారు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com