Kavitha : ఆర్టీసీ నష్టాల్లో ఉన్నా సీఎం కేసీఆర్ కాపాడుతున్నారు : ఎమ్మెల్సీ కవిత
X
By - TV5 Digital Team |31 May 2022 9:45 PM IST
Kavitha : కార్మికుల చెమటచుక్క విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించబోవన్నారు ఎమ్మెల్సీ కవిత. కాజీపేటలో కార్మిక ధర్మ యుద్ధం సభలో ప్రసంగించారు.
Kavitha : కార్మికుల చెమటచుక్క విలువ తెలియని ప్రభుత్వాలు మనుగడ సాధించబోవన్నారు ఎమ్మెల్సీ కవిత. కాజీపేటలో కార్మిక ధర్మ యుద్ధం సభలో ప్రసంగించారు. రైతు ఉద్యమ స్పూర్తితో కార్మికుల హక్కుల్ని కాలరాసేలా ఉన్న బీజేపీ నల్ల చట్టాలను రద్దు చేసేవరకు పోరాడుదామన్నారు. బ్రిటీష్వారిని మించిపోయిన మోదీ సర్కారు.... కార్పోరేట్ సంస్థలకు తొత్తుగా మారిందన్నారు. లక్ష కోట్ల విలువైన ఎయిర్ ఇండియాను వేల కోట్లు అమ్మేశాడన్నారు. అనుభవం లేకుండా... అన్ని సంస్థల్ని ఆదానికి అమ్ముతున్నారంటూ ఫైర్ అయ్యారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com