పోలీసు వ్యవస్థపై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు
By - TV5 Digital Team |23 Dec 2020 1:09 PM GMT
పోలీసులతో తమకు ఎలాంటి వైరం లేదని ముఖ్యమంత్రి మెప్పు కోసం పనిచేస్తున్న కొంతమంది వల్లనే పోలీస్ వ్యవస్థకు మచ్చ ఏర్పడుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు.
పోలీసులతో తమకు ఎలాంటి వైరం లేదని ముఖ్యమంత్రి మెప్పు కోసం పనిచేస్తున్న కొంతమంది వల్లనే పోలీస్ వ్యవస్థకు మచ్చ ఏర్పడుతోందని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఆవులను రక్షిస్తే కేసులు పెడతామంటున్నారని, గో రక్షణ కోసం ఇలాంటి ఎన్ని కేసులను ఎదుర్కొనేందుకైనా తాము సిద్ధమేనని చెప్పారు. కింది స్థాయి పోలీసులు ఉన్నతాధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, తమను స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వడం లేదని ఆవేదన చెందుతున్నారంటూ సంజయ్ వ్యాఖ్యలు చేశారు. గోరక్షకులపై కేసులు పెడతామంటున్న పోలీసులు ఆత్మ విమర్శ చేసుకోవాలని అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com