CM KCR: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

CM KCR: సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ

సీఎం కేసీఆర్‌కు.. కాంగ్రెస్‌ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి లేఖ రావారు. వారం రోజుల్లో DSC నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అసెంబ్లీలో ఇచ్చిన హామీ మేరకు 13వేల 500 పోస్టులకు నోటిఫికేషన్‌ను వారంలో వేయాలన్నారు. లేదంటే కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ప్రగతిభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో ఏం జరుగుతుందని ఆయన ప్రశ్నించారు.

నీళ్లు, నిధులు, నియామకాల నినాదంతో సాగిన ఉద్యమ ఆకాంక్షలు ఎక్కడ నెరవేరాయన్నారు. కాంగ్రెస్‌ హయాంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను అక్కడే వదిలేశారని.. మిగులు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తొమ్మిదిన్నరేళ్లలో తెలంగాణలో ఇచ్చిన నోటిఫికేషన్లు ఎన్ని..? భర్తీ చేసిన ఉద్యోగాలు ఎన్ని..? అదిగో ఇదిగో అంటూ నిరుద్యోగుల్ని ఊరించి వారిని నిండా ముంచేశారని మండిపడ్డారు. ముఖ్యంగా టీచర్ పోస్టుల అంశంలో పూర్తి నిర్లక్ష్యం వహించారన్నారు.

రాష్ట్రంలో వేలల్లో టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఓవైపు రిటైర్డ్ అవుతున్న వారి సంఖ్య పెరుగుతున్నా.. వారి స్థానాల్లో కొత్తవారిని తీసుకోవాలన్న సోయి ప్రభుత్వానికి లేకుండా పోయిందన్నారు. ఖాళీగా ఉన్న టీచర్‌ పోస్టుల కోసం సంవత్సరాలుగా అభ్యర్థులు ఎదురుచూస్తున్నారని.. వీరిల్లో కొందరి వయో పరిమితి కూడా దాటిపోతోందన్నారు. అమరవీరుల త్యాగ ఫలితం ఇదేనా? సకల జనులు కొట్లాడి సాధించుకున్న తెలంగాణ ఇందుకేనా? అని ప్రశ్నించారు.

Tags

Read MoreRead Less
Next Story