నిరుద్యోగులను మోసం చేసేందుకు కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు : రేవంత్‌ రెడ్డి

నిరుద్యోగులను మోసం చేసేందుకు కేసీఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌ వేశారు :  రేవంత్‌ రెడ్డి
Revanth Reddy : సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేసేందుకు మాస్టర్ ప్లాన్‌ వేశారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు.

Revanth Reddy : సీఎం కేసీఆర్‌ నిరుద్యోగులను మోసం చేసేందుకు మాస్టర్ ప్లాన్‌ వేశారని పీసీసీ చీఫ్‌ రేవంత్‌ రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉద్యోగాల ఖాళీలపై కేసీఆర్‌ సర్కస్‌ ఫీట్లు చేస్తున్నారంటూ ఫేస్‌బుక్‌లో కొన్ని పత్రాలు పెట్టారు. 2020 డిసెంబర్‌లో బిశ్వాల్‌ కమిటీ ఇచ్చిన PRC నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నట్లు అధికారికంగా స్పష్టమైందని తెలిపారు. ఆ నివేదిక ఉండగా... కొత్తగా ఖాళీలు 56 వేలు దాటడం లేదన్నట్లు దొంగ లెక్కలు చూపడమేంటని రేవంత్‌ ఫేస్‌బుక్‌లో ప్రశ్నించారు. వివిధ కార్పొరేషన్లలో ఖాళీల సంఖ్య లెక్క తీయాలని... అన్నింటినీ కలిపి జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించాలని రేవంత్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story