Revanth Reddy : గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించిన ఎంపీ రేవంత్ రెడ్డి

X
By - TV5 Digital Team |15 May 2021 6:26 PM IST
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రోజు వెయ్యి మందికి పైగా ఉచిత భోజనం అందిస్తారని చెప్పారాయన.
హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రి వద్ద ఉచిత భోజన సౌకర్యాన్ని ప్రారంభించారు కాంగ్రెస్ నేత, మల్కాజ్ గిరి ఎంపీ రేవంత్ రెడ్డి. రోజు వెయ్యి మందికి పైగా ఉచిత భోజనం అందిస్తారని చెప్పారాయన.. లాక్ డౌన్ వలన కరోనా బాధితుల కుటుంబ సభ్యులకు భోజనం దొరకడం లేదని.. దీనికోసం నుంచి ఇవాల్టి నుంచి ఉచిత భోజనం అందిస్తున్నట్లు తెలిపారు. లాక్ డౌన్ ఉన్నంత వరకు ఈ ఉచిత భోజనం ఉంటుందని చెప్పారు. పేద ప్రజలను ఆదుకునేందుకు కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చాలన్న రేవంత్ రెడ్డి.. ప్రైవేట్ ఆస్పత్రిల ఒత్తిడితోనే ప్రభుత్వం కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చడం లేదని విమర్శించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com