MUNICPAL POLL: ముగిసిన నామినేషన్ల పర్వం.. పార్టీలకు తప్పని రెబల్ పోరు

MUNICPAL POLL: ముగిసిన నామినేషన్ల పర్వం.. పార్టీలకు తప్పని రెబల్ పోరు
X
ప్రధాన పార్టీలకు తప్పని తిరుగుబాట్లు బెడద... అతికష్టం మీద ఉపసంహరించుకున్న కొందరు.. మరికొందరు మాత్రం ఉపసంహరణకు నో... 2,996 వార్డులకు బరిలో 12,993 మంది

రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణ సందర్భంగా అలకలు, బుజ్జగింపులు, బెదిరింపులు, తోపులాటలు, ధిక్కరణలు చోటు చేసుకున్నాయి. అన్ని ప్రధాన పార్టీలకూ తిరుగుబాట్ల బెడద తాకగా, చివరి క్షణం వరకూ రాజకీయ ఉత్కంఠ నెలకొంది. అగ్రనాయకుల జోక్యంతో ఎక్కువమందిని ఉపసంహరణకు ఒప్పించినప్పటికీ, కొద్దిమంది స్వతంత్రులుగా బరిలో నిలిచారు. నా­మి­నే­ష­న్ల ఉప­సం­హ­రణ గడు­వు మం­గ­ళ­వా­రం మధ్యా­హ్నం 3 గం­ట­ల­కు ము­గి­య­డం­తో రా­ష్ట్రం­లో­ని 2,996 వా­ర్డు­ల­కు మొ­త్తం 12,993 మంది అభ్య­ర్థు­లు తుది పో­టీ­లో ని­లి­చా­రు. ఈ దశలో 6,701 మంది తమ నా­మి­నే­ష­న్ల­ను ఉప­సం­హ­రిం­చు­కు­న్నా­రు. ఈ నెల 11న జర­గ­ను­న్న ము­న్సి­ప­ల్‌ ఎన్ని­క­ల­కు సం­బం­ధిం­చి ఒకే పా­ర్టీ నుం­చి ఒకే వా­ర్డు­కు నలు­గు­రై­దు­గు­రు పోటీ పడ­టం­తో అనేక చో­ట్ల నా­ట­కీయ పరి­ణా­మా­లు చోటు చే­సు­కు­న్నా­యి. గద్వా­ల­లో ఎమ్మె­ల్యే కృ­ష్ణ­మో­హ­న్‌­రె­డ్డి, కాం­గ్రె­స్‌ నా­య­కు­రా­లు సరిత వర్గాల మధ్య వి­భే­దా­లు తలె­త్తా­యి. మం­గ­ళ­వా­రం ఉద­య­మే కృ­ష్ణ­మో­హ­న్‌­రె­డ్డి కాం­గ్రె­స్‌ అభ్య­ర్థు­ల­కు బీ­ఫాం­లు ఇవ్వ­గా, సరిత వర్గీ­యు­లు ఏడు­గు­రు తామూ పో­టీ­లో కొ­న­సా­గు­తా­మ­ని ప్ర­క­టిం­చా­రు. ని­జా­మా­బా­ద్‌ జి­ల్లా ఆర్మూ­ర్‌­లో కాం­గ్రె­స్‌ టి­కె­ట్‌ దక్క­ని నలు­గు­రు ఆశా­వ­హు­లు వి­లే­క­ర్ల సమా­వే­శం ఏర్పా­టు చేసి, తమకు అన్యా­యం జరి­గిం­ద­ని, నా­మి­నే­ష­న్లు ఉప­సం­హ­రిం­చు­కు­నే ప్ర­స­క్తే లే­ద­ని స్ప­ష్టం చే­శా­రు. మిర్యాలగూడలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తన ఇద్దరు కుమారులు, భార్యతో నామినేషన్లు దాఖలు చేయించడం చర్చనీయాంశమైంది.

మి­ర్యా­ల­గూ­డ­లో కాం­గ్రె­స్‌ ఎమ్మె­ల్యే లక్ష్మా­రె­డ్డి తన ఇద్ద­రు కు­మా­రు­లు, భా­ర్య­తో నా­మి­నే­ష­న్లు దా­ఖ­లు చే­యిం­చ­డం రా­జ­కీ­యం­గా చర్చ­నీ­యాం­శ­మైం­ది. బు­ధ­వా­రం అక్కడ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి పర్య­టన నే­ప­థ్యం­లో ఈ వి­వా­దం ము­ద­ర­కుం­డా మం­గ­ళ­వా­రం ము­గ్గు­రి­తో­నూ నా­మి­నే­ష­న్లు ఉప­సం­హ­రిం­ప­జే­శా­రు. ఇలాం­టి కొ­న్ని చి­న్న­పా­టి ఘట­న­లు మి­న­హా నా­మి­నే­ష­న్ల ఉప­సం­హ­రణ ప్ర­క్రియ మొ­త్తం­గా ప్ర­శాం­తం­గా ము­గి­సి­న­ట్లు ఎన్ని­కల అధి­కా­రు­లు తె­లి­పా­రు. పె­ద్ద సం­ఖ్య­లో అభ్య­ర్థు­లు బరి­లో ఉం­డ­టం­తో వా­రి­ని సర్ది­చె­ప్ప­డం అగ్ర­నా­య­కు­ల­కు తల­నొ­ప్పి­గా మా­రిం­ది. ఈ నే­ప­థ్యం­లో అన్ని ప్ర­ధాన పా­ర్టీల నా­య­కు­లు హై­ద­రా­బా­ద్‌­లో­ని తమ పా­ర్టీ కా­ర్యా­ల­యాల నుం­చే ఉప­సం­హ­ర­ణల తతం­గా­న్ని పర్య­వే­క్షిం­చా­రు.

నామినేషన్ల ఉపసంహరణల ప్రక్రియ పూర్తవడంతో రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్‌ ఎన్నికల బరిలో రాజకీయ సమరం స్పష్టంగా కనిపిస్తోంది. తిరుగుబాట్లు, అసంతృప్తులు కొంతమేర ఉన్నప్పటికీ, చివరికి అన్ని ప్రధాన పార్టీలు తమ అధికారిక అభ్యర్థులతో పోటీలోకి దిగాయి. కొద్దిమంది స్వతంత్రులు మినహా, ఎక్కువశాతం వార్డుల్లో ప్రధాన పార్టీల మధ్య నేరుగా పోటీ నెలకొంది. ముఖ్యంగా అధికార కాంగ్రెస్‌, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీ మధ్య పట్టణ ప్రాంతాల్లో హోరాహోరీ పోరు తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం ఎలా ఉందన్నదే ఈ ఎన్నికల్లో కీలకంగా మారనుంది. అదే సమయంలో బీఆర్‌ఎస్‌ తమ గత పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ఓటర్లను ఆకర్షించేందుకు సిద్ధమైంది.

Tags

Next Story