Munugode: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..

Munugode: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి..
Munugode: మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది

Munugode : మునుగోడు ఉప ఎన్నిక కౌంటింగ్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రేపు ఉదయం 8 గంటలకు లెక్కింపు మొదలవుతుంది. గంటలోనే తొలి ఫలితం వస్తుందని అధికారులు చెబుతున్నారు. రేపు మధ్యాహ్నం కల్లా మునుగోడు ఫలితం వచ్చేస్తుందని చెబుతున్నారు. ముందుగా పోస్టల్ ఓట్లను లెక్కించి ఆ తరువాత ఈవీఎంల కౌంటింగ్‌ మొదలుపెడతారు.

మునుగోడు ఎన్నికలో 686 బ్యాలెట్‌ ఓట్లు పోల్‌ అయ్యాయి. నల్లగొండ అర్జాలబావిలోని వేర్‌హౌస్‌ కార్పొరేషన్ గోడౌన్‌లో కౌంటింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కోసం 21 టేబుల్స్‌ ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. మొత్తం 15 రౌండ్లలో కౌంటింగ్ పూర్తవుతుంది. ఒక్కో రౌండ్‌లో 21 పోలింగ్‌ కేంద్రాల ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునుగోడులో మొత్తం 298 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి.

మొదటి రౌండ్ ఫలితం ఉదయం 9 గంటలకు..చివరి రౌండ్ ఫలితం మధ్యాహ్నం 1 గంట వరకు ప్రకటిస్తారు. మొదటగా చౌటుప్పల్, తర్వాత నారాయణపురం, మునుగోడు, చండూరు, మర్రిగూడెం, నాంపల్లి, గట్టుప్పుల్​ మండలాల ఓట్లు లెక్కిస్తారు. కౌంటింగ్‌లో పాల్గొనే సిబ్బందికి మూడు దఫాలుగా శిక్షణ ఇచ్చారు.

ఒక్కో టేబుల్‌కు కౌంటింగ్ సూపర్​వైజర్​, అసిస్టెంట్ సూపర్​వైజర్, మైక్రో అబ్జర్వర్లను నియమించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు చేశారు. మునుగోడు నుంచి చివరి ఈవీఎం నిన్న అర్ధరాత్రి ఒకటిన్నరకు నల్గొండలోని స్ట్రాంగ్ రూమ్‌కు చేరింది.

ఈ తెల్లవారుజామున 4.40కి అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్​రూమ్‌ను సీజ్​ చేశారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద నిరంతరం సీఆర్పీఎఫ్​బలగాలు పహారా కాస్తున్నాయి. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షిస్తున్నారు. కౌంటింగ్ కోసం ప్రతి పార్టీ నుంచి 21 మంది ఏజెంట్లను నియమించారు.

Tags

Read MoreRead Less
Next Story