NALINI: ఇదీ నా మరణ వాంగ్మూలం.. ఇక సెలవు

NALINI: ఇదీ నా మరణ వాంగ్మూలం.. ఇక సెలవు
X
మాజీ డీఎస్పీ నళినీ సంచలన బహిరంగ లేఖ... మరణ వాంగ్మూలమంటూ ఫేస్‌బుక్‌లో పోస్ట్.. తన ఆరోగ్యం ఆందోళనకరంగా ఉందని వెల్లడి

తె­లం­గాణ ఉద్యమ సమ­యం­లో ప్ర­త్యేక రా­ష్ట్రం కోసం తన డీ­ఎ­స్పీ ఉద్యో­గా­న్ని త్యా­గం చేసి సం­చ­ల­నం సృ­ష్టిం­చిన అధి­కా­రి­ణి నళి­ని పేరు దశా­బ్దం తర్వాత మరో­సా­రి తె­ర­పై­కి వచ్చిం­ది. తె­లం­గాణ ఏర్ప­డిన తర్వాత రా­జ­కీ­యం­గా అదృ­శ్య­మైన ఆమె.. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం అధి­కా­రం­లో­కి రా­వ­డం­తో తి­రి­గి వె­లు­గు­లో­కి వచ్చా­రు. ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి ఆమె సే­వ­ల­ను గు­ర్తిం­చి, ఆమె­ను తి­రి­గి ఉద్యో­గం­లో­కి తీ­సు­కో­వా­ల­ని ఉన్న­తా­ధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. సీఎం ని­ర్ణ­యం­పై కృ­త­జ్ఞ­త­లు తె­లు­పు­తూ నళి­ని స్వ­యం­గా సీఎం రే­వం­త్‌­ను కలు­సు­కు­న్నా­రు. తనకు సర్వీ­సు­లో చేరే ఉద్దే­శం లే­ద­ని ఆమె వె­ల్ల­డిం­చా­రు. ఆ తర్వాత ఆమె పేరు మళ్లీ వి­ని­పిం­చ­లే­దు. తా­జా­గా.. ఫే­స్‌­బు­క్‌­లో నళి­ని సం­చ­లన పో­స్టు పె­ట్టా­రు. తాను ఇక బత­క­న­ని.. ఇది తన మరణ వాం­గ్మూ­లం అంటూ పో­స్టు పె­ట్టా­రు. నళి­ని రా­ష్ట్ర ప్ర­జ­ల­కు రా­సిన ఈ బహి­రంగ లేఖ సం­చ­ల­నం­గా మా­రిం­ది. 'తె­లు­గు రా­ష్ట్ర ప్ర­జ­ల­కు డీ­ఎ­స్పీ నళి­ని బహి­రంగ లేఖ ( వీ­లు­నా­మా/ మరణ వాం­గ్మూ­లం) ఒక అధి­కా­రి­ణి­గా, ఉద్య­మ­కా­రి­ణి­గా, రా­జ­కీ­య­వే­త్త­గా, ఆయు­ర్వేద ఆరో­గ్య సే­వి­క­గా, ఆధ్యా­త్మిక వే­త్త­గా సా­గిన నా జీ­వి­తం ము­గి­య­బో­తోం­ది. నా ఆరో­గ్య పరి­స్థి­తి నెల రో­జు­లు­గా సీ­రి­య­స్‌­గా ఉంది. ప్ర­స్తు­తం క్రి­టి­క­ల్ పొ­జి­ష­న్‌­లో ఉన్నా­ను.3 రో­జుల నుం­డి ని­ద్ర లేదు. రా­త్రం­తా మహా మృ­త్యుం­జయ మం­త్రా­న్ని జపి­స్తూ గడు­పు­తు­న్నా­ను. అని ఆ లే­ఖ­లో ఆమె భా­వో­ద్వే­గం­తో తె­లి­పా­రు.

రాజకీయాలకు వాడుకోవద్దు

‘‘ నా జీ­వి­తం ము­గి­య­బో­తోం­ది. సాయం కోసం నేను సీ­ఎం­కు పె­ట్టిన దర­ఖా­స్తు బు­ట్ట­దా­ఖ­లైం­ది. ఇప్ప­టి వరకు నన్ను ఏ నా­య­కు­డూ సన్మా­నిం­చ­లే­దు. నేను చని­పో­యాక రా­జ­కీయ లబ్ధి కోసం నా పేరు వా­డు­కో­వ­ద్దు. ప్ర­ధా­ని మో­దీ­ని కల­వ­లే­క­పో­యా­ను. నా మర­ణా­నం­త­రం నా లక్ష్య సాధన కోసం మోదీ ఏమై­నా చే­యా­లి. నేను స్థా­పిం­చిన వే­దా­మృ­తం ట్ర­స్టు­కు సాయం చే­యా­లి. వచ్చే జన్మ­లో మో­క్ష సాధన కోసం ప్ర­య­త్ని­స్తా.’’ అని నళి­ని తన లే­ఖ­లో పే­ర్కొ­న్నా­రు. " నా గత­మం­తా వ్యధ భరి­తం. తె­లం­గాణ ఉద్యమ పో­రా­టం వల్ల నా ని­లు­వె­ల్లా గా­యా­లే అయ్యా­యి. రా­జీ­నా­మా ద్వా­రా నాటి ప్ర­భు­త్వం పన్నిన పద్మ­వ్యూ­హం­లోం­చి బయట పడి­తే, డి­పా­ర్ట్మెం­ట్ నా వె­న్ను­లో సస్పె­న్ష­న్ అనే బల్లా­న్ని కసి తీరా దిం­పిం­ది. సహా­యం చే­సే­వా­డు కని­పిం­చక నొ­ప్పి­ని భరి­స్తూ­నే 12 ఏళ్ల అజ్ఞా­త­వా­సా­న్ని అను­భ­విం­చా­ను. మీ­డి­యా మి­త్రు­ల­కు వి­జ్ఞ­ప్తి. నేను చస్తే ఎవరూ సస్పెం­డె­డ్ ఆఫీ­స­ర్ అని రా­య­కం­డి. రి­జై­న్డ్ ఆఫీ­స­ర్, కవ­యి­త్రి, యజ్ఞ బ్ర­హ్మ అని నన్ను సం­భో­దిం­చం­డి. నా శరీ­రా­ని­కి జర­గా­ల్సిన అం­తిమ సం­స్కా­రం వై­ది­కం­గా జర­గా­లి. రా­ష్ట్ర నా­య­కు­ల­కు ఒక వి­న­తి. బ్ర­తు­కుం­డ­గా నన్ను పట్టిం­చు­కొ­ని మీరు రా­జ­కీయ లబ్ధి కోసం నా పే­రు­ను వా­డు­కో­వ­ద్దు. అని నళి­ని తన లే­ఖ­లో పే­ర్కొ­న్నా­రు.

Tags

Next Story