NAVEEN YADAV: "ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా"

NAVEEN YADAV: ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా
X
అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తానన్న నవీన్‌యాదవ్

జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గం అభి­వృ­ద్ధి­కి కృషి చేసి, తనను ఆద­రిం­చిన ప్ర­జల నమ్మ­కా­న్ని పూ­ర్తి స్థా­యి­లో ని­ల­బె­ట్టు­కుం­టా­న­ని ఎమ్మె­ల్యే నవీ­న్ యా­ద­వ్ ప్ర­క­టిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్‌ ఉప ఎన్నిక ఫలి­తాల అనం­త­రం మీ­డి­యా­తో మా­ట్లా­డిన ఆయన, ని­యో­జ­క­వ­ర్గ అభి­వృ­ద్ధి­కి సం­బం­ధిం­చిన కీలక వి­ష­యా­ల­ను వె­ల్ల­డిం­చా­రు. “ప్ర­జ­లు నా మీద నమ్మ­కం పె­ట్టు­కొ­ని, ఇక్కడ అభి­వృ­ద్ధి చెం­దు­తుం­ద­ని, భవి­ష్య­త్తు బా­గుం­టుం­ద­ని ఇచ్చిన ఆశీ­ర్వా­దం వృథా పోదు,” అని నవీ­న్ యా­ద­వ్ అన్నా­రు. గతం­లో దా­దా­పు 200 కో­ట్ల­తో అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­లు చే­ప­ట్టా­మ­ని గు­ర్తు చే­సిన ఆయన, ప్ర­జల నమ్మ­కా­న్ని దృ­ష్టి­లో ఉం­చు­కు­ని పని­చే­స్తా­న­ని హామీ ఇచ్చా­రు. కక్ష­పూ­రిత రా­జ­కీ­యా­లు చేసి ఉం­డ­వ­చ్చ­ని పరో­క్షం­గా పే­ర్కొం­టూ.. “నవీ­న్ యా­ద­వ్ దగ్గర అటు­వం­టి­వి ఉం­డ­వు. ఈరో­జు వరకే మీరు-మేము. ఇప్ప­టి నుం­డి మనం అంతా ఒకటే,” అని భరో­సా ఇచ్చా­రు.

ఓటములనే మెట్లుగా చేసుకుని...

జూ­బ్లీ­హి­ల్స్ ఉపఎ­న్ని­క­ల్లో కాం­గ్రె­స్ పా­ర్టీ వి­జ­యం సా­ధిం­చిం­ది. బీ­ఆ­ర్ఎ­స్ అభ్య­ర్థి మా­గం­టి సు­నీ­త­పై 24,729 ఓట్ల మె­జా­ర్టీ­తో నవీ­న్ యా­ద­వ్ గె­లు­పొం­దా­రు. ఎన్ని­కల అధి­కా­రు­లు నవీ­న్ యా­ద­వ్ గె­లు­పు­ని అధి­కా­రి­కం­గా ప్ర­క­టిం­చా­రు. నవీ­న్ యా­ద­వ్ వి­ష­యా­ని­కి వస్తే ఓట­ము­ల­నే మె­ట్లు­గా చే­సు­కు­ని ఈరో­జు ఎమ్మె­ల్యే­గా వి­జ­యం సా­ధిం­చా­రు. 2009 యూ­స­ఫ్ కూడా డి­వి­జ­న్ నుం­చి ఎం­ఐ­ఎం పా­ర్టీ నుం­చి కా­ర్పొ­రే­ట­ర్ గా ని­లి­చి తె­లు­గు­దే­శం అభ్య­ర్థి ము­ర­ళి గౌడ్ చే­తి­లో ఓటమి పా­ల­య్యా­రు. 2014లో ఎం­ఐ­ఎం నుం­చి జూ­బ్లీ­హి­ల్స్ ఎమ్మె­ల్యే­గా పోటీ చేసి 41 వేల ఓట్లు తె­చ్చు­కొ­ని రెం­డో స్థా­నం­లో ని­లి­చా­రు. అలా­గే 2015లో మరో­సా­రి ఎం­ఐ­ఎం అభ్య­ర్థి­గా రహ­మ­త్ నగర్ డి­వి­జ­న్ నుం­చి కా­ర్పొ­రే­ట­ర్ గా పోటీ చేసి ఓడి­పో­యా­రు. ఈ ఎన్ని­క­లో బీ­ఆ­ర్‌­ఎ­స్‌ పా­ర్టీ బలం­గా ఉన్నా, ఎక్కువ ఓట్లు వస్తా­య­ని అం­చ­నా వే­సిన ప్రాం­తా­ల్లో­నూ కాం­గ్రె­స్ అభ్య­ర్థి నవీ­న్ యా­ద­వ్ స్ప­ష్ట­మైన ఆధి­క్యా­న్ని ప్ర­ద­ర్శిం­చా­రు.

2018 లో జూ­బ్లీ­హి­ల్స్ ఎమ్మె­ల్యే స్వ­తం­త్ర అభ్య­ర్థి­గా పోటీ చేసి 19 వేల ఓట్లు తె­చ్చు­కు­న్నా­రు. ఇలా మొ­త్తం నా­లు­గు సా­ర్లు రెం­డు­సా­ర్లు కా­ర్పొ­రే­ట­ర్ గా రెం­డు­సా­ర్లు ఎమ్మె­ల్యే­గా పోటీ చేసి నా­లు­గు సా­ర్లు ఓడి­పో­యా­రు. అయి­నా కూడా ని­త్యం ప్ర­జ­ల­కు అం­దు­బా­టు­లో ఉంటూ స్థా­ని­కు­డు గా మంచి ము­ద్ర వే­సు­కు­న్నా­రు. చి­వ­ర­కు 2023 సా­ధా­రణ ఎన్ని­క­ల­కు నెల రో­జు­లు ముం­దు నవం­బ­ర్ 15న అప్ప­టి పి­సి­సి అధ్య­క్షు­డైన రే­వం­త్ రె­డ్డి సమ­క్షం­లో నవీ­న్ కాం­గ్రె­స్ పా­ర్టీ­లో చేరి అప్ప­ట్నుం­చి కొ­న­సా­గు­తు­న్నా­రు. 42 సం­వ­త్స­రాల వయసు ఉన్న నవీ­న్ యా­ద­వ్ తం­డ్రి చి­న్న శ్రీ­శై­లం యా­ద­వ్. భా­ర్య పేరు వర్ష, కు­మా­రు­డు అన్ష్ యా­ద­వ్. నవీ­న్ యా­ద­వ్యూ­స­‌­ఫ్‌­గూ­డ­‌­లో ఉంటూ రి­య­‌­ల్ ఎస్టే­ట్ వ్యా­పా­రం చే­స్తూ ఉం­టా­రు.

చరిత్రలోనే తొలిసారి...

కాం­గ్రె­స్ అభ్య­ర్థి నవీ­న్ యా­ద­వ్.. బీ­ఆ­ర్ఎ­స్‌ అభ్య­ర్థి మా­గం­టి సు­నీ­తా గో­పి­నా­థ్‌­పై 24,658 వేల ఓట్ల మె­జా­ర్టీ­తో గె­లు­పు కై­వ­సం చే­సు­కు­న్నా­రు. ఈ వి­జ­యం­తో నవీ­న్ యా­ద­వ్ నయా రి­కా­ర్డ్ సృ­ష్టిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­క­వ­ర్గ చరి­త్ర­లో­నే అత్య­ధిక మె­జా­ర్టీ­తో గె­లు­పొం­దిన వ్య­క్తి­గా ఘనత సా­ధిం­చా­రు. జూ­బ్లీ­హి­ల్స్ ని­యో­జ­వ­ర్గం­లో ఇప్ప­టి­వ­ర­కు అత్య­ధిక మె­జా­ర్టీ పీ­జే­ఆ­ర్ కు­మా­రు­డు వి­ష్ణు పే­రిట(2009లో 21,741) ఉం­డే­ది. ఇక, ది­వం­గత ఎమ్మె­ల్యే మా­గం­టి గో­పీ­నా­థ్ 2014లో 9,242, 2018లో 16,004, 2023లో 16,337 ఓట్ల మె­జా­ర్టీ­తో వి­జ­యం సా­ధిం­చా­రు. తా­జా­గా జరి­గిన జూ­బ్లీ­హి­ల్స్ ఉప ఎన్ని­క­లో కాం­గ్రె­స్ అభ్య­ర్థి నవీ­న్ యా­ద­వ్ 24,658 వేల ఓట్ల మె­జా­ర్టీ­తో వి­జ­యం సా­ధిం­చి ని­యో­జ­క­వ­ర్గ చరి­త్ర­లో అత్య­ధిక మె­జా­ర్టీ సా­ధిం­చిన వ్య­క్తి­గా రి­కా­ర్డ్ క్రి­యే­ట్ చే­శా­డు. హో­రా­హో­రీ­గా సా­గిన ఈ పో­రు­లో చి­వ­ర­కు అధి­కార కాం­గ్రె­స్ పా­ర్టీ వి­జ­యం సా­ధిం­చిం­ది.

Tags

Next Story