Operation Ganga: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్‌కు 40 మంది విద్యార్థులు..

Operation Ganga: ఉక్రెయిన్ నుండి హైదరాబాద్‌కు 40 మంది విద్యార్థులు..
Operation Ganga: ఉక్రెయిన్‌లో ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు.

Operation Ganga: ఆపరేషన్ గంగ శరవేగంగా కొనసాగుతోంది. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఉక్రెయిన్‌లో ఇబ్బంది పడుతున్న తెలుగు విద్యార్థులు క్షేమంగా స్వరాష్ట్రానికి చేరుకుంటున్నారు. తాజాగా నియో కన్సల్టెన్సీ ద్వారా వైద్య విద్యను అభ్యసించేందుకు ఉక్రెయిన్ వెళ్లి చిక్కుకున్న 40 మంది తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు.

వీరంతా జఫ్రోజియా యూనివర్సిటీలో వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో ఉద్విగ్న పరిస్థితులు నెలకొంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్‌లో చిక్కుకున్న 40మంది తెలంగాణ విద్యార్థులు హైదరాబాద్ చేరుకున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకున్న తమ పిల్లలను చూడగానే తల్లిదండ్రులు గుండెలకు హత్తుకుని కన్నీటి పర్యంతం అయ్యారు.

పిల్లలు క్షేమంగా చేరుకోవడంతో ఆనందంతో స్వీట్లు పంచుకున్నారు. తమను కంటికి రెప్పలా కాపాడుకొని స్వదేశానికి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిన నియో కన్సల్టెన్సీ అధికారుల బృందానికి విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కృతజ్ఞతలు చెప్పారు. ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో పాటు భారతీయులను యుద్ధ ప్రాతిపదికన స్వదేశానికి తరలించిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నియో కన్సల్టెన్సీ అధికారులు కృతజ్ఞతలు చెప్పారు.

మరోవైపు టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబు నాయుడు ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులతో జూమ్ యాప్ ద్వారా నిరంతరం సమీక్ష నిర్వహించి వారిలో మనో ధైర్యాన్ని నింపడానికి చేసిన కృషి మరువలేనిదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story