పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు

X
By - Nagesh Swarna |22 Feb 2021 7:39 PM IST
పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
పెద్దపల్లి జంట హత్యల కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. న్యాయవాద దంపతుల హత్యకేసులో మంథని న్యాయవాదులు పోరాటానికి సిద్ధమయ్యారు.. మంథని కోర్టులో న్యాయవాదులంతా విధులు బహిష్కరించాలని నిర్ణయించారు. ఇవాళ్టి నుంచి మార్చి 1 వరకు విధులకు దూరంగా ఉండనున్నారు.. అలాగే రామగుండం సీపీ సత్యనారాయణకు లీగల్ నోటీసులు జారీ చేస్తామంటున్నారు.. ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని వారంతా హైకోర్టుకు లేఖ రాయనున్నారు. నిందితుల తరపున ఎవరూ వకాల్తా తీసుకోవద్దని ఇతర బార్ అసోసియేషన్లకు లేఖలు రాయాలని న్యాయవాదులంతా నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com