KCR: ట్యాపింగ్ కేసులో తర్వాతి నోటీసులు కేసీఆర్‌కేనా..?

KCR: ట్యాపింగ్ కేసులో తర్వాతి నోటీసులు కేసీఆర్‌కేనా..?
X
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కలకలం

తెలంగాణ రాజకీయ వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకున్నట్లు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు కింది స్థాయి అధికారులు, మాజీ మంత్రుల విచారణలతో సాగిన ఈ కేసు, ఇప్పుడు నేరుగా గులాబీ పార్టీ అగ్రనేత వైపు మళ్లుతోందన్న చర్చ రాష్ట్ర రాజకీయాల్లో ప్రధాన అంశంగా మారింది. విచారణలో కీలక ఘట్టంగా మాజీ మంత్రి హరీష్ రావు విచారణ ముగియడం, తదుపరి అడుగు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే ఉంటుందన్న ప్రచారం బలపడటం రాజకీయంగా సంచలనంగా మారింది.

ఎన్ని­కల వ్యూ­హా­ల­కో­సం ఫో­న్లు ట్యా­ప్ అయ్యా­యా? వి­ప­క్ష నేతల వ్య­క్తి­గత సం­భా­ష­ణ­లు రహ­స్యం­గా రి­కా­ర్డు అయ్యా­యా? అధి­కార యం­త్రాం­గం రా­జ­కీయ అవ­స­రా­ల­కు వి­ని­యో­గిం­చ­బ­డిం­దా? — ఈ ప్ర­శ్న­ల­న్నీ ఇప్పు­డు ఒక్క బిం­దు­వు­లో కలు­స్తు­న్నా­యి. ఆ బిం­దు­వే… తె­లం­గాణ రా­జ­కీ­యా­ల్లో అత్యంత శక్తి­వం­త­మైన పేరు. ఫోన్ ట్యా­పిం­గ్ కేసు దర్యా­ప్తు ఇప్పు­డు ఆ స్థా­యి­కి చే­రు­కుం­ద­ని రా­జ­కీయ వర్గా­లు చర్చి­స్తు­న్నా­యి. సజ్జ­నా­ర్ నే­తృ­త్వం­లో­ని ప్ర­త్యేక దర్యా­ప్తు బృం­దం (సిట్) ఇటీ­వల హరీ­ష్ రా­వు­ను దా­దా­పు ఏడు­న్నర గంటల పాటు వి­చా­రిం­చిం­ది. ఈ వి­చా­ర­ణ­లో కీలక సమా­చా­రం లభిం­చిం­ద­న్న ప్ర­చా­రం రా­జ­కీయ వర్గా­ల్లో జో­రు­గా సా­గు­తోం­ది. గతం­లో అరె­స్ట­యిన అధి­కా­రుల వాం­గ్మూ­లా­లు, ఇప్ప­టి­కే రి­కా­ర్డైన స్టే­ట్‌­మెం­ట్లు, ఇప్పు­డు హరీ­ష్ రావు ఇచ్చిన వి­వ­రా­లు – ఇవ­న్నీ సరి­పో­ల్చిన తర్వా­తే తదు­ప­రి అడు­గు ఉం­టుం­ద­ని సమా­చా­రం. ఈ క్ర­మం­లో­నే దర్యా­ప్తు దిశ ఇప్పు­డు గు­లా­బీ పా­ర్టీ అధి­నేత కే­సీ­ఆ­ర్ వైపు మళ్లు­తోం­ద­న్న అభి­ప్రా­యం బల­ప­డు­తోం­ది. ఇదే వి­ష­యా­న్ని బీ­ఆ­ర్ఎ­స్ వర్కిం­గ్ ప్రె­సి­డెం­ట్ కే­టీ­ఆ­ర్ కూడా పరో­క్షం­గా ప్ర­స్తా­విం­చా­రు. “తం­డ్రి­కి కూడా నో­టీ­సు­లు ఇవ్వ­వ­చ్చు” అన్న సం­కేత వ్యా­ఖ్య­లు రా­జ­కీ­యం­గా మరింత చర్చ­కు దా­రి­తీ­శా­యి.

మాజీ ము­ఖ్య­మం­త్రి స్థా­యి నే­త­ను వి­చా­రిం­చా­లం­టే కే­వ­లం చట్ట­ప­ర­మైన పరి­జ్ఞా­నం సరి­పో­దు… రా­జ­కీయ, పరి­పా­ల­నా ఒత్తి­డు­ల­ను తట్టు­కు­నే ధై­ర్యం కూడా అవ­స­రం. ఇదే కా­ర­ణం­తో ప్ర­భు­త్వం ఈ కేసు బా­ధ్య­త­ను ఐపీ­ఎ­స్ అధి­కా­రి సజ్జ­నా­ర్కు అప్ప­గిం­చిం­ద­న్న వి­శ్లే­ష­ణ­లు వి­ని­పి­స్తు­న్నా­యి. సజ్జ­నా­ర్ నే­తృ­త్వం­లో­ని సిట్ వి­చా­రణ వేగం, సే­క­రి­స్తు­న్న ఆధా­రాల తీరు చూ­స్తుం­టే ఈ కే­సు­ను తే­ల్చా­ల­న్న పట్టు­దల ప్ర­భు­త్వా­ని­కి ఉన్న­ట్లు రా­జ­కీయ వి­శ్లే­ష­కు­లు అభి­ప్రా­య­ప­డు­తు­న్నా­రు. కే­వ­లం రా­జ­కీయ ఆరో­ప­ణ­ల­పై కా­కుం­డా, సాం­కే­తిక ఆధా­రా­ల­ను బలం­గా ని­ల­బె­ట్టే ది­శ­గా దర్యా­ప్తు సా­గు­తోం­ద­ని చె­బు­తు­న్నా­రు. ఫోన్ ట్యా­పిం­గ్ వంటి సు­న్ని­త­మైన అం­శం­లో మాటల కంటే ఆధా­రా­లే కీ­ల­కం. ఈ కే­సు­లో­నూ అదే జరు­గు­తు­న్న­ట్లు సమా­చా­రం.

సజ్జ­నా­ర్ దర్యా­ప్తు వేగం చూ­స్తుం­టే, వచ్చే కొ­ద్ది రో­జు­ల్లో మరి­న్ని సం­చ­ల­నా­లు వె­లు­గు­లో­కి వచ్చే అవ­కా­శ­ముం­ద­ని అం­చ­నా వే­స్తు­న్నా­యి. కే­సీ­ఆ­ర్‌­కు నో­టీ­సు­లు జారీ అయి­తే, అది కే­వ­లం ఒక వి­చా­రణ మా­త్ర­మే కాదు… తె­లం­గాణ రా­జ­కీ­యాల ది­శ­ను మా­ర్చే ఘట్టం­గా మారే అవ­కా­శం ఉంది. ఒక­వై­పు చట్టం తన పని తాను చే­స్తుం­దా? మరో­వై­పు రా­జ­కీయ పోరు మరింత ఉధృ­త­మ­వు­తుం­దా? అన్న ప్ర­శ్న­ల­కు సమా­ధా­నం రా­బో­యే రో­జు­ల్లో­నే తే­ల­నుం­ది. ఫోన్ ట్యా­పిం­గ్ కేసు… ఇప్పు­డు కే­వ­లం ఒక కేసు కాదు. అది తె­లం­గాణ రా­జ­కీ­యాల భవి­ష్య­త్తు­ను ప్ర­భా­వి­తం చేసే కేం­ద్ర బిం­దు­వు­గా మా­రు­తోం­ది.

Tags

Next Story