ICRISAT: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు హాజరైన ప్రధాని..

ICRISAT: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక ఎగ్జిబిషన్ను మోదీ సందర్శించారు. ప్రధానిని ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ జాక్వెలిన్ డి ఆరోస్ సన్మానించారు. ఇక్రిశాట్ పరిశోధనలు పురోగతిపై ప్రధానికి వివరించారు శాస్త్రవేత్తలు. సజ్జ, కంది, సెనగ, వేరుసెనగ, ఇతర చిరుధాన్యాలు విత్తన రకాలు, వాటి నాణ్యత గురించి మోదీ అడిగి తెలుసుకున్నారు. కొత్త వంగడాల రూపకల్పన, రైతులకు చేరవేస్తున్న తీరుపై ప్రధానికి వివరించారు శాస్త్రవేత్తలు ప్రధాని వెంట కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, నరేంద్రసింగ్ తోమర్, తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళిసై ఉన్నారు.
ముందుగా అనుకున్నట్టే జరిగింది. ప్రధాని మోదీకి జీఎంఆర్ ఎయిర్ పోర్టులో రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వాగతం పలికారు. తలసానితో పాటు సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి సైతం ప్రధానికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. తొలుత సీఎం కేసీఆర్ ప్రధాని హైదరాబాద్ పర్యటన ఆద్యంతం.. వెంటే ఉంటారని సీఎంవో వర్గాలు తెలిపాయి. అయితే ప్రస్తుతం కేసీఆర్ స్వల్ప జ్వరంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా ప్రధానికి స్వాగతం పలికేందుకు కేసీఆర్ ఎయిర్పోర్ట్కి వెళ్లలేకపోయారు. మోదీ ఎయిర్పోర్టు నుంచి నేరుగా పఠాన్చెరులోని ఇక్రిశాట్కు హెలికాప్టర్లో చేరుకున్నారు. అక్కడ ఇక్రిశాట్ గోల్డెన్ జూబ్లీ వేడుకలను ప్రారంభించారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com