Cheating Case: పెళ్లి పేరుతో మోసం.. మహిళా సినీ నిర్మాతపై కేసు..

Cheating Case: పెళ్లి పేరుతో మోసం.. మహిళా సినీ నిర్మాతపై కేసు..
కెమెరామెన్‌ను ట్రాప్ చేసిన టాలీవుడ్‌ మహిళా నిర్మాత

పెళ్లి పేరుతో మోసం చేసి బెదిరిస్తున్న ఓ మహిళ సినీ నిర్మాతపై జూబ్లీహిల్స్ పోలీసులు నమోదు చేశారు. సినీ పరిశ్రమలో కెమెరా అసిస్టెంట్ గా పనిచేస్తున్న నాగార్జున బాబు ఓ చిత్రనిర్మాతగా వ్యవహరించిన గుడివాడ ఆశామల్లిక పెళ్లి చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. బాధితుడు పలు దఫాలుగా ఆమెకు 18 లక్షల రూపాయలు ఇచ్చినట్లు తెలిపాడు. తరచూ గొడవలు జరగడంతో ఆమె గురించి వాకబు చేయగా గతంలోనే రెండు పెళ్లిళ్లు కావడంతో పాటు ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తేలింది. ఈ విషయంపై బాధితుడు నిలదీయడంతో అతనిపై కూకట్ పల్లి పోలీస్ స్టేషన్ లో గృహహింస కేసు పెట్టింది. ఆశామల్లిక గతంలోనూ పలువురిని ఇదే తరహాలో మోసం చేసినట్లు బాధితుడు తెలిపాడు. తాను నమోదు చేయించిన కేసును రాజీ చేసుకోవాలంటే ఆస్తిలో వాటా ఇవ్వాలని బెదిరిస్తోందని బాధితుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆమెపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

భైరవపురం చిత్ర నిర్మాణ సమయంలో మహిళా నిర్మాత ఆశ మల్లికతో అతనికి పరిచయం ఏర్పడింది. ఓ రోజు మళ్లిక నాగార్జునను తన ఇంటికి డిన్నర్‌కు పిలిచింది. ఆ సమయంలో వారిద్దరూ దగ్గరయ్యారు. ఆ తర్వాత తనకు తనకు వివాహమైందని, భర్తకు విడాకులు ఇస్తానని చెప్పి చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో నాగార్జునను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత తనకు డబ్బు అవసరమంటూ అతని నుంచి రూ.18.50లక్షలు తీసుకుంది. డబ్బులు అడిగితే బెదిరింపులకి దిగి కూకట్‌పల్లి పోలీసు స్టేషన్లలో నాగార్జున బాబుపై కేసు పెట్టింది.

మల్లిక వ్యవహారశైలిపై నాగార్జునకు అనుమానం వచ్చి ఆమె గురించి ఆరా తీయగా.. అసలు విషయం వెలుగులోకి వచ్చింది. మళ్లికకు అప్పటికే రెండు పెళ్లిళ్లు అయినట్లు, ముగ్గురు పిల్లలున్నట్లు తెలిసింది. ఒకే వివాహమైందని, పిల్లలు లేరని అబద్దం చెప్పి తనను మోసం చేసి పెళ్లి చేసుకందని నాగార్జున పోలీసులను ఆశ్రయించాడు. ఆశమల్లిక 2016లో గాజువాక పోలీస్‌ స్టేషన్‌లో మొదటి భర్త భరత్‌పై 2019లో కూకట్‌పల్లి పోలీస్‌ స్టేషన్‌లో రెండో భర్త శ్రీనివాస్‌పై ఫిర్యాదులు చేసిందని పోలీసుల విచారణలో తెలిసింది. నకిలీ ఐడీ కార్డులతో మోసాలకు పాల్పడి.. వాళ్ల ఆస్తిలో వాటా కొట్టేస్తున్నట్లుగా కూడా వెల్లడైంది. నిందితురాలిపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ ముమ్మరం చేస్తున్నారు. నాగార్జున ఒక్కడేనా..ఇంకా ఎవరినైనా మోసం చేసిందా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story