రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు..!

రైతులకు అపార నష్టాన్ని మిగిల్చిన అకాల వర్షాలు..!
అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. అర్థరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసింది.

అకాల వర్షాలు ఉమ్మడి వరంగల్ జిల్లా రైతులకు అపార నష్టాన్ని మిగిల్చాయి. అర్థరాత్రి వరకు జిల్లా వ్యాప్తంగా వడగళ్ల వాన కురిసింది. మామిడి, మిర్చి, పసుపు, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. ములుగు జిల్లా మంగపేట ఏజెన్సీలో ఉరుములు, మెరుపులతో వాన పడింది. గోదావరి తీరాన ఆరబోసిన మిర్చి తడిసిపోయింది. టార్పాలిన్లు కప్పినప్పటికీ గాలి దుమారం కారణంగా వచ్చిన పంట చేతికి అందకుండా పోయింది. భూపాలపల్లి, జనగామ, వరంగల్ రూరల్ జిల్లాల్లోనూ వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది.

Tags

Read MoreRead Less
Next Story