Drug Case: రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కలకలం..

Drug Case: రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కలకలం..
రాజకీయ నేత కుమారుడితో పాటు మరో ఇద్దరి అరెస్ట్

హైదరాబాద్‌ను డ్రగ్ ఫ్రీ నగరంగా మార్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు తీసుకుంటున్నా ఫలితం ఉండటం లేదు. డ్రగ్స్ తీసుకుంటూ, విక్రయిస్తూ దొరుకుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. తాజాగా నేడు గచ్చిబౌలిలోని ఓ స్టార్ హోటల్‌లో పెద్దమొత్తంలో డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ క్రమంలో ఓ రాజకీయ నాయకుడి కుమారుడితో పాటు మరో ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గత రాత్రి హోటల్‌లో నిర్వహించిన విందు కార్యక్రమంలో వారంతా డ్రగ్స్ వినియోగించినట్టు తెలుస్తోంది.

రాడిసన్ స్టార్ హోటల్లో డ్రగ్స్ కలకలం రేపింది. నిన్న రాత్రి పార్టీకి హాజరైన యువకులు పెద్ద ఎత్తున డ్రగ్స్ తీసుకున్నారు. పోలీసులు పక్కా సమాచారంతో రాడిసన్ హోటల్‌పై దాడి చేశారు. డ్రగ్స్ తీసుకున్నట్టు గుర్తించి ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద పెద్ద మొత్తంలో కొకైన్ స్వాధీనం చేసుకున్నారు.. పట్టుబడిన వారిలో ప్రముఖ వ్యాపారవేత్తతో పాటు బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నారు. 2009లో శేరిలింగంపల్లి నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన యోగానంద్ కుమారుడు వివేకానంద రాడిసన్ హోటల్‌లో డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడు. హోటల్ కూడా యోగానంద్‌దేనని తెలుస్తోంది. మూడు రోజులుగా ఈ ముగ్గురూ పార్టీ చేసుకుంటున్నట్టు సమాచారం. ముగ్గురు యువకులనూ పోలీసులు విచారిస్తున్నారు. కాగా, గతవారం యూట్యూబ్ స్టార్ షణ్ముఖ్ జస్వంత్ గంజాయి తాగుతూ దొరికాడు. ఫీచర్ ఫిల్మ్‌లలో నటించే ఓ నటి ఇటీవల డ్రగ్స్ విక్రయిస్తూ పోలీసులకు రెడ్ ‌హ్యాండెడ్‌గా చిక్కింది. గతేడాది సెప్టెంబర్‌లో రాజేంద్రనగర్ పరిధిలో వరలక్ష్మి టిఫిన్ సెంటర్ యజమాని ప్రభాకర్‌రెడ్డి, మహిళా డ్రగ్ సరఫరాదారు లింగంపల్లి అనురాధ సహా మరికొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ఈ డ్రగ్ పార్టీలో ఎంత మంది పాల్గొన్నారనే దానిపై విచారిస్తున్నారు . డ్రగ్స్ సప్లై చేసిన వారిపై ఆరా తీస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story