Telangana: బీఆర్‌ఎస్‌తో పొత్తేలేదు: రాహుల్‌ గాంధీ

Telangana: బీఆర్‌ఎస్‌తో పొత్తేలేదు: రాహుల్‌ గాంధీ
తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ

తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తో పొత్తు ఉండబోదని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ. ఈ విషయాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని తెలంగాణ కాంగ్రెస్‌ నేతలకు సూచించినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొని తిరిగి ఢిల్లీకి వెళుతున్న సమయంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న రాహుల్ గాంధీతో కాంగ్రెస్ పార్టీ నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర రాజకీయాలపై కాంగ్రెస్ నేతలతో అరగంట పాటు చర్చించారు. కర్ణాటక ఎన్నికలు ముగిసిన తర్వాత తెలంగాణ రాష్ట్రానికి ఎక్కువ సమయం కేటాయిస్తానని, తెలంగాణ పై ఫోకస్ చేస్తానని టీ కాంగ్రెస్ నేతలకు రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ తో పొత్తు పై స్పందించిన రాహుల్ గాంధీ తెలంగాణ ప్రాంత నేతలతో శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీతో పొత్తు ఉండబోదని రాహుల్ గాంధీ ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

Tags

Read MoreRead Less
Next Story