REVANTH: వరద బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం

REVANTH: వరద బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
X
కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ పర్యటన.. వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన సీఎం.. నష్ట పరిహారం చెల్లిస్తామని ముఖ్యమంత్రి ప్రకటన

వరద బా­ధి­తు­లం­ద­రి­నీ తె­లం­గాణ ప్ర­భు­త్వం ఆదు­కుం­టుం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి హామీ ఇచ్చా­రు. భా­గాల వా­రీ­గా వరద నష్టం­పై పూ­ర్తి వి­వ­రా­లు సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ము­ఖ్య­మం­త్రి ఆదే­శిం­చా­రు. కా­మా­రె­డ్డి జి­ల్లా తా­డ్వా­యి మం­డ­లం ఎర్ర­ప­హా­డ్‌­లో వరద నష్టా­న్ని ఆయన పరి­శీ­లిం­చా­రు. వరద ప్ర­భా­విత ప్రాం­తా­ల­ను పరి­శీ­లిం­చా­రు. లిం­గం­పే­ట­లో వర­ద­ల­కు దె­బ్బ­తి­న్న లిం­గం­ప­ల్లి­కు­ర్దు ఆర్&బి బ్రి­డ్జి­ని పరి­శీ­లిం­చా­రు. వరదల సమ­యం­లో బ్రి­డ్జి పరి­స్థి­తి­పై ఏర్పా­టు చే­సిన ఫోటో ఎగ్జి­బి­ష­న్‌­ను తి­ల­కిం­చా­రు. తా­త్కా­లిక మర­మ్మ­తు­ల­తో సరి­పె­ట్ట­కుం­డా బ్రి­డ్జి ని­ర్మా­ణా­ని­కి పూ­ర్తి­స్థా­యి ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. భవి­ష్య­త్ లో ఇలాం­టి పరి­స్థి­తు­లు తలె­త్త­కుం­డా బ్రి­డ్జ్ కమ్ బ్యా­రే­జీ లేదా బ్రి­డ్జ్ కమ్ చెక్ డ్యా­మ్ తర­హా­లో ని­ర్మిం­చేం­దు­కు సా­ధ్యా­సా­ధ్యా­ల­ను పరి­శీ­లిం­చా­ల­ని సూ­చిం­చా­రు. రై­తు­ల­తో మా­ట్లా­డిన సీఎం రే­వం­త్ వారి ఇబ్బం­దు­ల­ను తె­లు­సు­కు­న్నా­రు. పొ­లా­ల్లో ఇసుక మే­ట­లు పే­రు­కు­పో­య్యా­య­ని, పం­ట­ల­తో పాటు ఇం­డ్లు కూడా వర­ద­ల్లో ము­ని­గి­పో­యి ఇబ్బం­దు­లు పడ్డా­మ­ని సీ­ఎం­కు రై­తు­లు, గ్రా­మ­స్థు­లు వి­వ­రిం­చా­రు. అం­ద­రి­నీ ప్ర­భు­త్వం ఆదు­కుం­టుం­ద­ని సీఎం హామీ ఇచ్చా­రు. వర­ద­ల్లో మృతి చెం­దిన వారి కు­టుం­బా­ల­కు రూ. 5 లక్షల పరి­హా­రం, పశు­సం­ప­ద­ను కో­ల్పో­యిన వా­రి­కి సహా­యం అం­దిం­చేం­దు­కు చర్య­లు చే­ప­ట్టా­ల­ని అధి­కా­రు­ల­కు ఆదే­శిం­చా­రు. “కొ­డం­గ­ల్ కు నేను ఎంత సాయం చే­స్తా­నో… కా­మా­రె­డ్డి­కి కూడా అంతే సాయం చే­స్తా. ధై­ర్యం­గా ఉం­డం­డి… ప్ర­భు­త్వం మీకు అం­డ­గా ఉం­టుం­ది” అని సీఎం రే­వం­త్ రె­డ్డి ప్ర­జ­ల­కు హామీ ఇచ్చా­రు. ఎవరూ పరా­మ­ర్శ­కు కూడా రా­లే­ద­ని బా­ధ­ప­డిన వా­రి­కి సీఎం భరో­సా­తో సం­తో­షం వ్య­క్తం చే­స్తు­న్నా­రు.

ఇదీ వందేళ్లలో రానంత వరద

“వం­దే­ళ్ల­లో ఎప్పు­డూ రా­నంత వరద వచ్చిం­ది. ప్ర­భు­త్వం మి­మ్మ­ల్ని కచ్చి­తం­గా ఆదు­కుం­టుం­ది. ఎల్లా­రె­డ్డి ని­యో­జ­క­వ­ర్గం ఎమ్మె­ల్యే మదన్ మో­హ­న్ మీకు అం­డ­గా ని­లి­చి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జర­గ­కుం­డా చూ­శా­రు. కష్టం వచ్చి­న­పు­డు అం­డ­గా ఉండే వాడే నా­య­కు­డు. మీకు అం­డ­గా ఉండి ఎమ్మె­ల్యే అడ్డు­కు­న్నా­రు. కష్టా­ల్లో ఉన్న­పు­డు ప్ర­జ­ల­కు తో­డు­గా ఉం­డా­ల­ని నా­య­కు­ల­కు సూ­చి­స్తు­న్నా. అన్ని సమ­స్య­లు పరి­ష్క­రిం­చే బా­ధ్యత ప్ర­భు­త్వం తీ­సు­కుం­టుం­ది. క్షే­త్ర­స్థా­యి­లో పర్య­టిం­చి అధి­కా­రు­లు పూ­ర్తి­స్థా­యి­లో వరద నష్టా­న్ని అం­చ­నా వే­యా­లి.” అని వ్యా­ఖ్యా­నిం­చా­రు.

సమన్వయం ఉండాలన్న సీఎం

కా­మా­రె­డ్డి జి­ల్లా­లో వర­ద­న­ష్టం­పై కలె­క్ట­రే­ట్‌­లో సీఎం సమీ­క్ష ని­ర్వ­హిం­చా­రు. ప్ర­భు­త్వ శాఖల మధ్య సమ­న్వ­యం ఉం­టే­నే.. వరద నష్టా­ల­ను తగ్గిం­చ­గ­ల­మ­ని రే­వం­త్‌ అన్నా­రు. ఎవ­రి­కి వారు ఉం­టా­మం­టే క్రై­సి­స్‌ మే­నే­జ్‌­మెం­ట్‌ చే­య­లే­మ­న్నా­రు. భారీ వర్షా­లు, వరదల కా­ర­ణం­గా జి­ల్లా­లో ఎంత నష్టం జరి­గిం­ది, ఎన్ని ని­ధు­లు అవ­స­ర­మో స్ప­ష్ట­మైన ని­వే­దిక ఇవ్వా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. మర­మ్మ­తు­లు, ని­ర్మా­ణా­లు, తా­త్కా­లి­కం కా­కుం­డా శా­శ్వత ప్రా­తి­ప­ది­కన చే­ప­ట్టా­ల­ని సూ­చిం­చా­రు. అం­ద­రూ సమ­న్వ­యం­తో పని చే­యా­ల­ని సూ­చిం­చా­రు.

Tags

Next Story