REVANTH: మావోలూ రండి.. తెలంగాణను పునర్నిర్మిద్దాం

REVANTH: మావోలూ రండి.. తెలంగాణను పునర్నిర్మిద్దాం
X
లొంగిపోయిన మావోయిస్టులకు సీఎం పిలుపు... మావో అంశాలపై చర్చించేందుకు సిద్ధమని వెల్లడి.. గణపతి లొంగిపోతే రక్షణ బాధ్యత తమదేనని భరోసా

తె­లం­గా­ణ­లో మా­వో­యి­స్టు సమ­స్య­కు శాం­తి­యుత పరి­ష్కా­రం కను­గొ­నే ది­శ­గా రా­ష్ట్ర ప్ర­భు­త్వం ముం­దు­కు సా­గు­తోం­ది. ఈ నే­ప­థ్యం­లో మా­వో­యి­స్టు అగ్ర­నేత గణ­ప­తి లొం­గి­పో­తే ఆయన ఆరో­గ్యం, భద్ర­త­కు రా­ష్ట్ర ప్ర­భు­త్వ­మే పూ­ర్తి బా­ధ్యత వహి­స్తుం­ద­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి స్ప­ష్టం చే­శా­రు. రా­ష్ట్రం­లో హిం­స­కు ఎలాం­టి స్థా­నం లే­ద­ని ఆయన తె­లి­పా­రు. ఇంకా అజ్ఞా­తం­లో ఉన్న మా­వో­యి­స్టు­లు ఆయు­ధా­ల­ను వది­లి సమాజ ప్ర­ధాన ప్ర­వా­హం­లో­కి రా­వా­ల­ని సీఎం పి­లు­పు­ని­చ్చా­రు. వారు లే­వ­నె­త్తే సమ­స్య­ల­పై చర్చిం­చేం­దు­కు ప్ర­భు­త్వం ఎప్ప­టి­కీ సి­ద్ధం­గా ఉం­టుం­ద­ని ఆయన పే­ర్కొ­న్నా­రు.

హై­ద­రా­బా­ద్‌­లో­ని ఐసీ­సీ­సీ కేం­ద్రం­లో శని­వా­రం జరి­గిన కా­ర్య­క్ర­మం­లో ము­ఖ్య­మం­త్రి సమ­క్షం­లో పె­ద్ద సం­ఖ్య­లో మా­వో­యి­స్టు­లు లొం­గి­పో­యా­రు. ఉమ్మ­డి ఆం­ధ్ర­ప్ర­దే­శ్ చరి­త్ర­లో ఇప్ప­టి­వ­ర­కు చూ­డ­ని వి­ధం­గా మొ­త్తం 130 మంది మా­వో­యి­స్టు­లు 124 ఆయు­ధా­ల­తో లొం­గి­పో­వ­డం గమ­నా­ర్హం. ఈ కా­ర్య­క్ర­మం­లో రా­ష్ట్ర పో­లీ­సు ఉన్న­తా­ధి­కా­రు­లు కూడా పా­ల్గొ­న్నా­రు. డీ­జీ­పీ శి­వ­ధ­ర్ రె­డ్డి, అద­న­పు డీ­జీ­పీ­లు వి­జ­య్ కు­మా­ర్ (ఇం­టె­లి­జె­న్స్), అని­ల్ కు­మా­ర్ (గ్రే­హౌం­డ్స్), అలా­గే ఎస్‌­ఐ­బీ చీఫ్ సు­మ­తి ఈ సమా­వే­శా­ని­కి హా­జ­ర­య్యా­రు. లొం­గి­పో­యిన మా­వో­యి­స్టు­ల­కు తక్షణ ఆర్థిక సాయం అం­ద­జే­య­డం­తో పాటు వారు అప్ప­గిం­చిన ఆయు­ధా­ల­ను అధి­కా­రు­లు పరి­శీ­లిం­చా­రు. ఈ సం­ద­ర్భం­గా మా­ట్లా­డిన ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి, ఎలాం­టి సమ­స్య­ల­కై­నా హిం­సా­త్మక మా­ర్గం కా­కుం­డా చర్చల ద్వా­రా­నే పరి­ష్కా­రం సా­ధ్య­మ­ని ప్ర­పం­చ­వ్యా­ప్తం­గా అను­స­రి­స్తు­న్న వి­ధా­నా­న్ని ఉదా­హ­ర­ణ­గా చె­ప్పా­రు. ప్ర­భు­త్వం ఎలాం­టి అం­శా­ల­పై అయి­నా చర్చిం­చేం­దు­కు సి­ద్ధం­గా ఉం­ద­ని ఆయన మరో­సా­రి స్ప­ష్టం చే­శా­రు.

కొ­ద్ది రో­జుల క్రి­తం లొం­గి­పో­యిన మా­వో­యి­స్టు నేత దే­వ్‌­జీ­తో తాను సు­దీ­ర్ఘం­గా చర్చిం­చి­న­ట్లు సీఎం వె­ల్ల­డిం­చా­రు. మా­వో­యి­స్టుల అభి­ప్రా­యా­లు, సమ­స్య­ల­ను ప్ర­భు­త్వం ముం­దు ఉం­చి­న­ట్ల­యి­తే వా­టి­ని గణ­ప­తి సహా మి­గి­లిన నా­య­కు­ల­కు తె­లి­య­జే­స్తా­మ­ని దే­వ్‌­జీ హామీ ఇచ్చి­న­ట్లు ఆయన తె­లి­పా­రు. సమ­స్య­ల­ను శాం­తి­యు­తం­గా పరి­ష్క­రిం­చ­గ­లి­గి­తే దే­శ­వ్యా­ప్తం­గా సీ­పీఐ (ఎం­ఎ­ల్) సం­స్థ­ను రద్దు చే­య­డా­ని­కి కూడా సి­ద్ధ­మ­ని కొం­ద­రు నే­త­లు చె­ప్పి­న­ట్లు సీఎం వి­వ­రిం­చా­రు. మా­వో­యి­స్టుల ఆవే­ద­న­ను రా­ష్ట్ర ప్ర­భు­త్వం గమ­నిం­చిం­ద­ని ఆయన అన్నా­రు. అయి­తే వారి కొం­త­మం­ది డి­మాం­డ్లు కేం­ద్ర ప్ర­భు­త్వ పరి­ధి­లో­కి వస్తా­య­ని పే­ర్కొ­న్నా­రు. అం­దు­కే తాను స్వ­యం­గా కేం­ద్ర హోం­మం­త్రి అమి­త్ షాను కలి­సి ఈ అం­శం­పై చర్చిం­చి­న­ట్లు సీఎం తె­లి­పా­రు. తె­లం­గా­ణ­లో లొం­గు­బా­ట్ల వి­ష­యం­లో రా­ష్ట్ర ప్ర­భు­త్వా­ని­కి పూ­ర్తి స్వే­చ్ఛ ఇచ్చేం­దు­కు కేం­ద్రం సా­ను­కూ­లం­గా స్పం­దిం­చి­న­ట్లు ఆయన చె­ప్పా­రు. ప్ర­జా­స్వా­మ్యం­లో సమ­స్య­ల­కు తుది పరి­ష్కా­రం బు­ల్లె­ట్ ద్వా­రా కా­కుం­డా బ్యా­ల­ట్ ద్వా­రా వస్తుం­ద­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అభి­ప్రా­య­ప­డ్డా­రు. అదే నమ్మ­కం­తో­నే పె­ద్ద సం­ఖ్య­లో మా­వో­యి­స్టు­లు లొం­గి­పో­తు­న్నా­ర­ని ఆయన తె­లి­పా­రు. ప్ర­జల సమ­స్య­ల­ను ప్ర­జా­స్వా­మ్య పద్ధ­తి­లో­నే పరి­ష్క­రిం­చు­కో­వ­చ్చ­ని ఆయన అన్నా­రు. లొం­గి­పో­యిన మా­వో­యి­స్టు­లు భయ­ప­డా­ల్సిన అవ­స­రం లే­ద­న్నా­రు.

Tags

Next Story