ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్: పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి

ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్: పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి
ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి.

ప్రపంచంలో అతి పెద్ద దళిత ద్రోహి సీఎం కేసీఆర్ అంటూ విరుచుకుపడ్డారు పీసీసీ చీఫ్ రేవంత్‌ రెడ్డి. దళిత్‌ ఎంపవర్‌మెంట్ పేరుతో నియోజకవర్గానికి కేవలం వంద కుటుంబాలకు సహాయం చేస్తామనడం దళితులకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. దళితులకు సీఎం కేసీఆర్ చేస్తున్న ద్రోహంపై పోరాడాల్సిన సమయం వచ్చిందన్నారు. పంజాగుట్టలో అంబేడ్కర్ విగ్రహం పెడితే తీసుకెళ్లి పోలీస్ స్టేషన్‌లో పెట్టిన ఘనత సీఎం కేసీఆర్‌దని కామెంట్ చేశారు. 125 అడుగుల అంబేడ్కర్ విగ్రహం పెడతానని చెప్పి.. తట్టెడు మట్టి తీయలేదని విమర్శించారు. దళితులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని మండిపడ్డారు. దళితుల విషయంలో వీహెచ్ చాలా కమిటెడ్‌గా ఉన్నారన్న రేవంత్‌ రెడ్డి.. వీహెచ్ సలహాలు, సూచనలు తీసుకొని ముందుకు వెళ్తానని చెప్పుకొచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story