Revanth reddy : తెలంగాణ విముక్తి కోసం పోరాటం ఆగదు : రేవంత్ రెడ్డి
By - /TV5 Digital Team |22 Sep 2021 12:30 PM GMT
తెలంగాణ విముక్తికోసం పోరాటం ఆగదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టి తెలంగాణ కోసం కొట్లాడినట్లు ఉందన్నారు.
తెలంగాణ విముక్తికోసం పోరాటం ఆగదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ధర్నా చౌక్ చూస్తుంటే ఆనాడు జేఏసీ పెట్టి తెలంగాణకోసం కొట్లాడినట్లు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై అఖిలపక్షం ఆధ్వర్యంలో ఇందిరాపార్క్ వద్ద ధర్నా చేపట్టారు. రాష్ట్రంలో పోడుభూముల కోసం కొట్లాట మొదలైందన్నారు. మహిళలని చూడకుండా డెకాయిట్ కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. హరితహారం ముగుసులో పోడు భూములను గుంజుకుంటున్నారని ఆరోపించారు. పోరాడి సాధించుకున్న తెలంగాణ నలుగురి చేతుల్లో బంది అయిందని రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. తెలంగాణ విముక్తి కావాలంటే గులాబీ చీడ వదిలించుకోవాలన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com