Revanth Reddy : మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచిన రేవంత్ రెడ్డి..
By - Sai Gnan |11 Oct 2022 4:00 PM GMT
Revanth Reddy : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది
Revanth Reddy : మునుగోడు ఉపఎన్నిక ప్రచారంలో కాంగ్రెస్ దూకుడు పెంచింది. మునుగోడులో గెలుపే లక్ష్యంగా టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పుల్లెంలలో ఎన్నికల ప్రచారం చేసిన రేవంత్రెడ్డి.. బీజేపీ, టీఆర్ఎస్లపై నిప్పులు చెరిగారు.
కాంగ్రెస్ను చంపడమే మోదీ, కేడీ ఆలోచనా, లక్ష్యమని ఆరోపించారు. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో రాజగోపాల్రెడ్డి ఏనాడు మునుగోడు సమస్యలపై పోరాటం చేయలేదన్నారు. 2014లో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి ఏం వెలగబెట్టారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ను గెలిపిస్తే మునుగోడు ప్రజల కోసం అసెంబ్లీలో కేసీఆర్తో పాల్వాయి స్రవంతి కొట్లాడుతుందని రేవంత్రెడ్డి అన్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com