Revanth reddy : పెద్దమ్మగుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు.. !
By - TV5 Digital Team |7 July 2021 6:30 AM GMT
PCC చీఫ్గా బాధ్యతలు చేపట్టే ముందు.. పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు.
PCC చీఫ్గా బాధ్యతలు చేపట్టే ముందు.. పెద్దమ్మ తల్లి గుడిలో రేవంత్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడి నుంచి భారీ ర్యాలీగా బయలుదేరారు. నాంపల్లి దర్గాకి వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్, పలువురు కమిటీ సభ్యులు కూడా ప్రత్యేక పూజలు చేస్తారు. అంజన్ కుమార్ యాదవ్ సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేసి అక్కడి నుంచి వచ్చి అసెంబ్లీలోని బంగారు మైసమ్మను దర్శించుకుంటారు. ఆ తర్వాత నాంపల్లి రెడ్ రోజ్ ఫంక్షన్ హాల్ నుంచి అనుచరులు, అభిమానులతో కలిసి రేవంత్ రెడ్డి రెడ్డి ర్యాలీతో జతకలిసి గాంధీభవన్ చేరుకుంటారు..
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com