REVANTH: రేవంత్‌ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం

REVANTH: రేవంత్‌ సర్కార్‌ విప్లవాత్మక నిర్ణయం
X
ఓవర్సీస్ విద్యా నిధి లబ్దిదారులు పెంపు... విదేశాలకు బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులు.. పూలే విద్యా నిధి బీసీ లబ్దిదారుల సంఖ్య 700... అంబేద్కర్ విద్యా నిధి లబ్ధితారుల సంఖ్య 500

తె­లం­గాణ ప్ర­భు­త్వం అమలు చే­స్తు­న్న అం­బే­ద్క­ర్ ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి, మహా­త్మా జ్యో­తి­బా­పూ­లే ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి వంటి పథ­కాల ద్వా­రా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­రి­టీ వి­ద్యా­ర్ధు­ల­కు అం­త­ర్జా­తీయ వర్సి­టీ­ల్లో పీజీ, పీ­హె­చ్‌­డీ కో­ర్సు­లు చది­వేం­దు­కు ప్ర­భు­త్వం స్కా­ల­ర్‌­షి­ప్‌ రూ­పం­లో చే­యూ­త­ను అం­ది­స్తోం­ది. ఈ పథ­కా­లు అమ­ల్లో­కి వచ్చి­న­ప్ప­టి­తో పో­లి­స్తే ఆశా­వా­హుల సం­ఖ్య రె­ట్టిం­పు అయిం­ది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­రి­టీ వి­ద్యా­ర్ధు­ల­కు అం­బే­ద్క­ర్ ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి, మహా­త్మా జ్యో­తి­బా­పూ­లే ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి వంటి పథ­కాల కల్ప­త­రు­వు­గా మా­రా­యి. రే­వం­త్ రె­డ్డి ప్ర­భు­త్వం ఈ వి­ష­యం­పై ప్ర­త్యేక దృ­ష్టి సా­రిం­చిం­ది. ప్ర­తిభ ఉండి కూడా ఉన్నత వి­ద్య­కు దూ­ర­మ­వు­తు­న్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మై­నా­రి­టీ వ‌­ర్గాల వి­ద్యా­ర్ధు­ల­కు అం­డ­గా ని­ల­వా­ల­ని ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. వారి జీ­వి­తా­ల­కు గేమ్ ఛేం­జ­ర్ గా ని­లి­చే ఇటు­వం­టి పథ­కా­ల­ను ఆద­ర్శం­గా అమలు చే­యా­ల­నే ఉద్దే­శం­తో లబ్ది­దా­రు­ల­కు మం­జూ­రు చేసే స్కా­ల­ర్‌­షి­ప్‌ల సం­ఖ్య­ను రె­ట్టిం­పు చేసే వి­ప్ల­వా­త్మక ని­ర్ణ­యం తీ­సు­కుం­ది. తద్వా­రా వి­దే­శీ వర్సీ­టి­ల్లో చది­వే తె­లం­గాణ వి­ద్యా­ర్ధుల సం­ఖ్య రె­ట్టిం­పు కా­నుం­ది. ఫలి­తం­గా గతం­లో ఈ మూడు పథ­కాల కింద లబ్ది పొం­దే వి­ద్యా­ర్ధుల సం­ఖ్య 1,110 అయి­తే ప్ర­‌­జా­ప్ర­భు­త్వ ని­ర్ణ­యం­తో ఆ సం­ఖ్య 1,900కి చే­రిం­ది.

పెరిగిన లబ్ధిదారుల సంఖ్య

మహా­త్మా జ్యో­తి­బా­పూ­లే ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి కింద 300 మంది బీసీ వి­ద్యా­ర్ధు­ల­కు మా­త్ర­మే అవ­కా­శం కల్పిం­చే వారు. ఇం­దు­లో ఈబీ­సీల వాటా 15. ము­ఖ్య­‌­మం­త్రి ఎ.రే­వం­త్ రె­డ్డి నే­తృ­త్వం­లో­ని ప్ర­‌­జా ప్ర­భు­త్వం ఈ సం­ఖ్య­ను 700కి పెం­చిం­ది. ఇం­దు­లో 500 బీసీ వి­ద్యా­ర్ధు­ల­కు, 200 ఈబీ­సీ వి­ద్యా­ర్ధు­ల­కు కే­టా­యిం­చా­రు. అంటే లబ్ది­పొం­దే బీసీ వి­ద్యా­ర్ధుల సం­ఖ్య దా­దా­పు 133 శాతం పె­రి­గిం­ది. ఇప్ప­టి­కే బీసీ-సీ, బీసీ-ఈ వర్గా­ల­కు చెం­దిన 500 మంది వి­ద్యా­ర్ధు­లు లబ్ది పొం­దు­తు­న్నా­రు. వారు కా­కుం­డా ఇప్పు­డు బీ­సీ­లు 500 మంది లబ్ది పొం­దు­తా­రు. మొ­త్తం­గా చూ­స్తే సం­వ­‌­త్స­‌­రా­ని­కి 1000 మంది బీసీ వి­ద్యా­ర్ధు­లు లబ్ది పొం­దు­తా­రు. అం­బే­ద్క­ర్ ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి కింద గతం­లో 210 మంది ఎస్సీ వి­ద్యా­ర్ధు­ల­కు అవ­కా­శం కల్పిం­చే వారు. ప్ర­‌­జా ప్ర­భు­త్వం ఈ సం­ఖ్య­ను 500కి పెం­చిం­ది. అంటే లబ్ది­పొం­దే ఎస్సీ వి­ద్యా­ర్ధుల సం­ఖ్య దా­దా­పు 138 శాతం పె­రి­గిం­ది. అం­బే­ద్క­ర్ ఓవ­ర్సీ­స్ వి­ద్యా నిధి కింద గతం­లో 100 మంది ఎస్టీ వి­ద్యా­ర్ధు­ల­కు అవ­కా­శం కల్పిం­చే వారు. కాం­గ్రె­స్ ప్ర­భు­త్వం ఈ సం­ఖ్య­ను 200కి పెం­చిం­ది.

Tags

Next Story