REVANTH: దక్షిణ కుంభమేళాను ఘనంగా నిర్వహించాలి

REVANTH: దక్షిణ కుంభమేళాను ఘనంగా నిర్వహించాలి
X
గోదావరి పుష్కరాలపై సీఎం రేవంత్ సమీక్ష... శాశ్వత ప్రాతిపదికన ఏర్పాట్లు చేయాలన్న సీఎం..ముందస్తు ప్రణాళికలు తయారు చేయాలని ఆదేశం

గో­దా­వ­రి, కృ­ష్ణా పు­ష్క­రాల ని­ర్వ­హ­ణ­పై తె­లం­గాణ ము­ఖ్య­మం­త్రి రే­వం­త్‌­రె­డ్డి­పై కమాం­డ్ కం­ట్రో­ల్ సెం­ట­ర్‌­లో సమీ­క్షా సమా­వే­శం ని­ర్వ­హిం­చా­రు. ఈ క్ర­మం­లో టెం­పు­ల్ సెం­ట్రి­క్ ఘా­ట్స్ అభి­వృ­ద్ధి­పై పలు కీలక సూ­చ­న­లు చే­శా­రు. శా­శ్వత ప్రా­తి­ప­ది­కన సెం­ట్రి­క్ ఘా­ట్స్ ఏర్పా­ట్ల­పై ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. టెం­పు­ల్ సెం­ట్రి­క్ ఘా­ట్స్ అభి­వృ­ద్ధి­కి ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని అధి­కా­రు­ల­కు సూ­చిం­చా­రు. గో­దా­వ­రి పరి­వా­హక ప్రాం­తం­లో ప్ర­ముఖ ఆల­యా­ల­ను మొ­ద­టి ప్రా­ధా­న్య­త­గా తీ­సు­కు­ని శా­శ్వత ఘా­ట్స్ ని­ర్మా­ణా­లు చే­ప­ట్టేం­దు­కు చర్య­లు తీ­సు­కో­వా­ల­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి మా­ర్గ­ని­ర్దే­శం చే­శా­రు. సీ­ఎం­తో పాటు మం­త్రి కొం­డా సు­రేఖ, సీఎం సల­హా­దా­రు వేం నరేం­ద­ర్ రె­డ్డి, దే­వా­దాయ శాఖ ము­ఖ్య కా­ర్య­ద­ర్శి శై­ల­జా రా­మ­య్య­ర్, సీ­ఎం­వో ము­ఖ్య కా­ర్య­ద­ర్శి శే­షా­ద్రి, ము­ఖ్య­మం­త్రి ము­ఖ్య కా­ర్య­ద­ర్శి శ్రీ­ని­వా­స­రా­జు, ధా­ర్మిక సల­హా­దా­రు గో­వింద హరి తది­త­రు­లు పా­ల్గొ­న్నా­రు. బాసర నుం­చి భద్రా­చ­లం వరకు గో­దా­వ­రి పరి­వా­హ­కం­లో­ని ఆల­యా­ల­ను క్షే­త్ర­స్థా­యి­లో సం­ద­ర్శిం­చి అను­వైన వా­టి­ని ఎం­పిక చే­యా­ల­ని సూ­చిం­చా­రు సీఎం రే­వం­త్‌­రె­డ్డి. బాసర, కా­ళే­శ్వ­రం, ధర్మ­పు­రి, భద్రా­చ­లం­తో­పా­టు ఇతర ప్ర­ముఖ ఆల­యా­ల­ను సం­ద­ర్శిం­చి ప్ర­త్యే­కం­గా జా­బి­తా­ను సి­ద్ధం చే­యా­ల­ని అధి­కా­రు­ల­ను ఆదే­శిం­చా­రు. జా­తీయ రహ­దా­రుల సమీ­పం­లో ఉన్న గో­దా­వ­రి పరి­వా­హక ఆల­యా­ల­కు ఎక్కువ ప్రా­ధా­న్యం ఇవ్వా­ల­ని ది­శా­ని­ర్దే­శం చే­శా­రు.

2027 జులై 23 నుంచి...

2027లో జులై 23వ తేదీ నుం­చి గో­దా­వ­రి పు­ష్క­రా­లు ప్రా­రం­భ­మ­వు­తా­యి. ఇప్ప­టి నుం­చి దా­దా­పు 22 నెలల వ్య­వ­ధి ఉన్నం­దున శా­శ్వ­త­మైన మౌ­లిక వస­తు­లు, అభి­వృ­ద్ధి పను­ల­పై ప్ర­త్యేక దృ­ష్టి పె­ట్టా­ల­ని సీఎం రే­వం­త్ రె­డ్డి అధి­కా­రు­ల­కు ఆదే­శా­లు జారీ చే­శా­రు. మహా­రా­ష్ట్ర నుం­చి తె­లం­గా­ణ­లో ప్ర­వే­శిం­చే గో­దా­వ­రి నది­కి రా­ష్ట్రం­లో 560 కి­లో­మీ­ట­ర్ల తీర ప్రాం­త­ముం­ది. దా­దా­పు 74 చో­ట్ల పు­ష్కర ఘా­ట్ల­ను ఏర్పా­టు చే­యా­ల్సిన అవ­స­ర­ముం­టుం­ద­ని అధి­కా­రు­లు ము­ఖ్య­మం­త్రి­కి వి­వ­రిం­చా­రు. ప్ర­స్తు­తం ఉన్న ఘా­ట్స్‌­ను వి­స్త­రిం­చ­డం­తో­పా­టు రో­డ్లు, ఇతర సౌ­క­ర్యా­ల­ను శా­శ్వత ప్రా­తి­ప­ది­కన పను­లు చే­ప­ట్టే­లా ప్ర­ణా­ళి­క­లు సి­ద్ధం చే­యా­ల­ని ఆదే­శిం­చా­రు సీఎం రే­వం­త్‌­రె­డ్డి. పు­ష్క­రాల సమ­యం­లో దా­దా­పు రెం­డు లక్షల మంది ఒకే­సా­రి ఘా­ట్స్ వద్ద స్నా­న­మా­చ­రిం­చేం­దు­కు వీ­లు­గా ఉం­డే­లా అభి­వృ­ద్ధి చే­యా­ల­ని సీఎం సూ­చిం­చా­రు. ప్ర­తీ ఆల­యా­ని­కి స్థా­నిక పరి­స్థి­తు­ల­కు అను­గు­ణం­గా వే­ర్వే­రు­గా ఘా­ట్స్ డి­జై­న్లు రూ­పొం­దిం­చా­ల­ని సీఎం ది­శా­ని­ర్దే­శం చే­శా­రు. మహా కుం­భ­మే­ళా­తో పాటు గతం­లో వి­విధ రా­ష్ట్రా­ల్లో పు­ష్క­రా­లు, ఆల­యాల అభి­వృ­ద్ధి, భక్తు­ల­కు అవ­స­ర­మైన సౌ­క­ర్యాల రూ­ప­క­ల్ప­న­లో అను­భ­వ­ము­న్న కన్స­ల్టె­న్సీ­ల­ను ని­య­మిం­చు­కో­వా­ల­ని ఆదే­శిం­చా­రు.

Tags

Next Story