REVANTH: మీ ఓటే అభయ "హస్తమై".. వెలుగులు నింపుతోంది

REVANTH: మీ ఓటే అభయ హస్తమై.. వెలుగులు నింపుతోంది
X
మక్తల్‌లో ప్రజాపాలన-ప్రజావిజయోత్సవ సభ... పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్, మంత్రులు... పాలమూరును దేశంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుదాం

గ్రా­మా­న్ని అభి­వృ­ద్ధి చే­సే­వా­రి­ని సర్పం­చ్ ఎన్ని­క­ల్లో ఎన్ను­కో­వా­ల­ని ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి పి­లు­పు­ని­చ్చా­రు. మం­చో­డి­కి అవ­కా­శం ఇస్తే అభి­వృ­ద్ధి చే­స్తా­డు.. ముం­చే­టో­డి­కి అవ­కా­శం ఇవ్వొ­ద్ద­ని కో­రా­రు. కా­ళ్ల­ల్లో కట్టె­లు పె­ట్టే వా­ళ్ళు.. ఊరి అభి­వృ­ద్ధి­ని ఎప్ప­టి­కీ జరు­గ­ని­వ్వ­రు అని చె­ప్పా­రు. మీకు ని­ధు­లు ఇచ్చే బా­ధ్యత తన­ద­ని హామీ ఇచ్చా­రు. రా­బో­యే పదే­ళ్ల­లో పా­ల­మూ­రు­ను పసి­డి పంటల పా­ల­మూ­రు­గా అభి­వృ­ద్ధి చే­సు­కుం­దా­మ­ని కో­రా­రు. నప­ర్తి జి­ల్లా ఆత్మ­కూ­రు, నా­రా­య­ణ­పేట జి­ల్లా మక్త­ల్‌ ము­న్సి­పా­లి­టీ­ల్లో పలు అభి­వృ­ద్ధి కా­ర్య­క్ర­మా­ల్లో పా­ల్గొ­న్నా­రు. ముం­దు­గా ఆత్మ­కూ­రు, అమ­ర­చింత పు­ర­పా­లక సం­ఘాల పరి­ధి­లో రూ.151.92 కో­ట్ల అభి­వృ­ద్ధి పను­లు, రూ.121.92 కో­ట్ల­తో జూ­రాల ప్రా­జె­క్టు ది­గు­వన హై­లె­వ­ల్‌ వం­తెన ని­ర్మా­ణా­ని­కి.. రూ.82.32 కో­ట్ల­తో మక్త­ల్‌-నా­రా­య­ణ­పేట రో­డ్డు, మక్త­ల్‌ పట్టణ పరి­ధి­లో రూ.118.82 కో­ట్ల­తో చే­ప­ట్ట­ను­న్న పలు పను­ల­కు శం­కు­స్థా­పన చే­శా­రు. మక్త­ల్‌­లో ని­ర్వ­హిం­చిన ప్ర­జా­పా­లన- ప్ర­జా­వి­జ­యో­త్సవ సభలో ప్ర­సం­గిం­చా­రు. సీఎం రే­వం­త్‌ రె­డ్డి మా­ట్లా­డు­తూ.. మక్త­ల్ ని­యో­జ­క­వ­ర్గా­న్ని గత పా­ల­కు­లు ని­ర్ల­క్ష్యం చే­శా­ర­న్నా­రు. అం­దు­కే మక్త­ల్ నుం­చి ప్ర­జా­పా­లన వి­జ­యో­త్స­వా­లు ప్రా­రం­భిం­చా­మ­ని ఆయన తె­లి­పా­రు. పా­ల­మూ­రు గడ్డ ప్రే­మి­స్తే ప్రా­ణ­మి­స్తుం­ద­ని, మో­స­గి­స్తే పా­తా­ళా­ని­కి తొ­క్కు­తుం­ద­న్నా­రు సీఎం రే­వం­త్. గత పా­ల­కు­లు ఈ ప్రాం­తా­ల­కు నీ­ళ్లు ఇవ్వా­ల­న్న ఆలో­చన చే­య­లే­ద­ని ఆయన మం­డి­ప­డ్డా­రు. ఈ జి­ల్లా ప్రా­జె­క్టు­ల­ను గత ప్ర­భు­త్వా­ధి­నేత పూ­ర్తి చే­య­లే­ద­ని, సా­గు­నీ­రు, తా­గు­నీ­రు కోసం ఏనా­డు గత పా­ల­కు­లు తా­ప­త్ర­య­ప­డ­లే­ద­ని సీఎం రే­వం­త్‌­రె­డ్డి ధ్వ­జ­మె­త్తా­రు. పా­ల­మూ­రు గడ్డ ప్రే­మి­స్తే ప్రా­ణ­మి­స్తుం­ది.. మో­స­గి­స్తే పా­తా­ళా­ని­కి తొ­క్కు­తుం­ద­న్నా­రు.

ఎంత ఖర్చయినా సరే.. పూర్తిచేసే తీరుతా...

ఈ రెం­డే­ళ్ల వి­జ­యో­త్సవ సభను మొదట మక్త­ల్‌­లో ని­ర్వ­హిం­చు­ర­కో­వ­డం సం­తో­షం­గా ఉం­ద­ని అన్నా­రు. ఉమ్మ­డి రా­ష్ట్రం­తో పాటు పదే­ళ్ల బీ­ఆ­ర్ఎ­స్ పా­ల­న­లో­నూ ఉమ్మ­డి పా­ల­మూ­రు జి­ల్లా ని­ర్ల­క్ష్యా­ని­కి గు­రైం­ద­ని అన్నా­రు. పా­ల­మూ­రు ప్ర­జ­లు అరి­గోస పడు­తు­న్నా.. ఏ నా­య­కు­డు కూడా పట్టిం­చు­కో­లే­దు. అం­దు­కే ఈసా­రి పా­ల­మూ­రు జి­ల్లా ప్ర­జ­లు 12 మంది కాం­గ్రె­స్ ఎమ్మె­ల్యే­ల­ను గె­లి­పిం­చా­ర­ని అన్నా­రు. స్వా­తం­త్ర్యం వచ్చిన తొ­లి­రో­జు­ల్లో ఈ జి­ల్లా నుం­చి బూ­ర్గుల రా­మ­కృ­ష్ణా­రా­వు సీఎం అయ్యా­రు.. తర్వాత 75 ఏళ్ల­లో పా­ల­మూ­రు జి­ల్లా నుం­చి ఎవరూ సీఎం కా­లే­దు.. మళ్లీ ఇన్నా­ళ్ల తర్వాత రా­ష్ట్ర సీ­ఎం­గా మీ బి­డ్డ­కు అవ­కా­శం వచ్చిం­ది. ఉమ్మ­డి జి­ల్లా­లో­ని ప్రా­జె­క్టు­లు అన్నీ పూ­ర్తి­చే­సే బా­ధ్యత తన­ద­ని అన్నా­రు. ఇప్ప­టి­కే నా­రా­య­ణ­పేట-కొ­డం­గ­ల్ ప్రా­జె­క్టు, పా­ల­మూ­రు-రం­గా­రె­డ్డి ప్రా­జె­క్టుల పను­లు శర­వే­గం­గా జరు­గు­తు­న్నా­య­ని తె­లి­పా­రు. అం­దు­కే ప్ర­జా పాలన వా­రో­త్స­వా­లు ఇక్క­డి నుం­చి మొ­ద­లు పె­ట్టా­మ­ని చె­ప్పా­రు. కొం­ద­రు కు­ట్ర­పూ­రి­తం­గా నా­రా­య­ణ­పేట-కొ­డం­గ­ల్ ప్రా­జె­క్టు­పై కే­సు­లు వేసి అడ్డు­కు­నే ప్ర­య­త్నం చే­స్తు­న్నా­రిన ఫైర్ అయ్యా­రు. ఎవ­రె­న్ని కు­ట్ర­లు చే­సి­నా ఏది ఆగ­ద­ని స్ప­ష్టం చే­శా­రు. ప్రా­జె­క్టు­ల­కు భూ­ము­లు ఇచ్చిన ఏ రై­తు­ను కూడా అన్యా­యం చే­య­బో­మ­ని.. ఎక­రా­కు రూ.20 లక్షల పరి­హా­రం ఇచ్చేం­దు­కు ని­ర్ణ­యిం­చి­న­ట్లు తె­లి­పా­రు. మాయగాళ్ల మాటలు విని ప్రాజెక్టులు, అభివృద్ధిని అడ్డుకోవద్దని రైతులను కోరారు.

Tags

Next Story