తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్
By - Nagesh Swarna |7 Dec 2020 12:47 PM GMT
తెలంగాణ రైతులకు సీఎం కేసీఆర్ గుడ్ న్యూస్ ప్రకటించారు. ఈ నెల 27 నుంచి జనవరి 7వ తేదీ వరకు రైతు బంధు సహాయం పంపీణీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రగతి భవన్లో యాసంగి సీజన్ రైతు బంధు సహాయంపై చర్చించిన ఆయన.. రాష్ట్రంలో రైతులందరికీ రైతు బంధు సహాయం ఇవ్వాలని నిర్ణయించారు. పది రోజుల్లో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేయాలని సూచించారు. అలాగే అవసరమైన 7 వేల 300 కోట్లు విడుదల చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు.
Tags
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com